వైజాగ్ లో సొంత థియేటర్ ని అమ్మేసిన సురేష్ బాబు.. కారణం అదేనా..?

Anilkumar
కరోన సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా తారుమారు చేసింది అనే చెప్పాలి.అయితే  కరోనా వ్యాప్తి చెందడంతో సినీ పరిశ్రమపై కోలుకోలేని దెబ్బ పడింది. ఇక కరోనా వ్యాప్తి చెందటం వల్ల ఒక్కసారిగా థియేటర్ లు మూతపడటమే కాకుండా థియేటర్లు మూతపడటంతో ఓటీటీల ఆదరణ పెరిగిపోయింది.ఇకపోతే ఈ క్రమంలోనే ఇంటిల్లిపాది ఇంటిలో కూర్చుని ఎంతో సంతోషంగా ఓటీటీలలో సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. అయితే ఈ విధంగా ఓటీటీలకు అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్లు తెరుచుకొని యధావిధిగా థియేటర్లో రన్ అవుతున్నప్పటికీ థియేటర్లకు రాలేని పరిస్థితి ఏర్పడింది.ఇదిలావుంటే ఒకవైపు సినిమా టికెట్ల రేట్లు పెంచడంతో..

 సామాన్యులకు కుటుంబంతో కలిసి సినిమా చూసే పరిస్థితులు కూడా లేకుండా పోయాయి. అయితే ఈ క్రమంలోనే థియేటర్లకు వెళ్లి వేలు వేలు ఖర్చు పెట్టుకోలేనివారు కేవలం అతి తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది ఓటీటీలలో సినిమా చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇక దీంతో థియేటర్లకు వచ్చే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోవడంతో ఏకంగా కొందరు థియేటర్లను అమ్మకానికి కూడా పెడుతున్నారు.కాగా  ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దగ్గుబాటి సురేష్ బాబు విశాఖ నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి జ్యోతి థియేటర్ అమ్మేసినట్టు తెలుస్తుంది.

అయితే విశాఖ నగరంలో సెంటర్లో ఉన్నటువంటి ఈ థియేటర్ విశాఖ నగరంలో ఉన్నటువంటి ఓ ప్రముఖ వ్యాపారులకు అమ్మినట్టు తెలుస్తుంది.కాగా కరోనా తర్వాత థియేటర్లకు ఆదరణ తగ్గటం వల్లే డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నటువంటి ఈయన తన థియేటర్ అమ్మడం చర్చనీయాంశంగా మారింది.ఇక  ఈ విధంగా తన థియేటర్ అమ్మేసి ఆ స్థానంలో 10 అంతస్తుల బిల్డింగ్ కట్టడం కోసమే పలువురు వ్యాపారులు ఈయన దగ్గర నుంచి థియేటర్ భారీ ధరకు కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీల్స్ పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఈయన ఈ థియేటర్ అమ్మడం వెనుక ఉన్న కారణం ఏంటి అనే విషయం తెలియాలంటే ఈ వార్తలపై సురేష్ బాబు స్పందించాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: