'ది వారియర్' నష్టాలు బోయపాటితోనే తీరాలా?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ హీరోగా నటించిన 'ది వారియర్' చిత్రం జూలై 15న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది.కానీ మొదటి రోజు ఈ చిత్రంకి కలెక్షన్లు బాగానే వచ్చాయి.అయితే టాక్ ఎఫెక్ట్ వల్ల రెండు, మూడు, నాలుగు రోజుల్లో కలెక్షన్లు తగ్గినప్పటికీ సినిమా పర్వాలేదు అనిపించింది. కానీ మొదటి సోమవారం నాటి నుంచి ఈ మూవీ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ దారుణంగా ఉంది. ఈ మావీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మరో రూ.20 కోట్ల వరకు కూడా షేర్ ను రాబట్టాలి.కానీ అది ఇప్పుడు చాలా కష్టంగానే కనిపిస్తుంది. మాస్ సెంటర్స్ లో అయితే ఈ చిత్రం పర్వాలేదు అనిపిస్తున్నా.. ఎ సెంటర్ ఆడియన్స్ మాత్రం ఈ మూవీని పూర్తిగా పక్కన పెట్టినట్లు స్పష్టమవుతుంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. 'ది వారియర్' థియేట్రికల్ రన్ ముగిసేసరికి బయ్యర్స్ కు మొత్తంగా రూ.15 కోట్ల వరకు నష్టాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.


అయితే ఇక అందులో 20 శాతం అనేది ప్రొడక్షన్ టీం చెల్లిస్తుందని.. బ్యాలన్స్ మొత్తం రామ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం థియేట్రికల్ హక్కులతో కవర్ చేస్తామని నిర్మాతలు హామీ ఇచ్చినట్లు టాక్ తెలుస్తుంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమా అంటే మినిమం గ్యారెంటీ. ఆయన ఏ నిర్మాతతో సినిమా చేసినా కూడా వారికి భారీ లాభాలు అందిస్తూ ఉంటాడు.ఇక బోయపాటి శ్రీను - రామ్ కాంబినేషన్లో రూపొందనున్న మూవీ పాన్ ఇండియా మూవీ కావడంతో నిర్మాతలకు అదో ధైర్యం అని అనుకోవాలి. నిజానికి 'ది వారియర్' సినిమా బిజినెస్ ఎక్కువ జరగడానికి బోయపాటి శ్రీనుతో రామ్ చేస్తున్న మూవీ వల్లనే అనే టాక్ కూడా బాగా వినిపించింది. కాబట్టి ఇప్పుడు 'ది వారియర్' సినిమా నష్టాలు బోయపాటి మూవీతోనే తీరాలన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: