లింగుస్వామి కథని మహేష్,బన్నీ రిజెక్ట్ చేయడానికి అసలు కారణం అదేనా..?

Anilkumar
టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు లింగుస్వామి గురించి కూడా తెలిసే ఉంటుంది .ఇక  లింగుస్వామి దర్శకత్వం వహించిన ది వారియర్ మూవీ మరో 72 గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది.ఇక ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాగా ఈ సినిమా రిజల్ట్ విషయంలో రామ్ పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే ది వారియర్ సినిమాకు 30 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఇకపోతే రామ్ గత సినిమాలలో ఒకటైన ఇస్మార్ట్ శంకర్ 34 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించగా రెడ్ సినిమా 19 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.

ఇక రామ్ సినిమాకు హిట్ టాక్ వస్తే 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం కష్టం లేదు. కాగా కృతిశెట్టికి యూత్ లో ఉన్న క్రేజ్ కూడా ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. పోతే దర్శకుడు లింగుస్వామి ది వారియర్ ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.  ఇకపోతే మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు లింగుస్వామి చెప్పిన కథలు నచ్చినా ఆ కథలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించకపోవచ్చనే అనుమానంతో మహేష్, బన్నీ ఆ కథలను రిజెక్ట్ చేశారని సమాచారం అందుతోంది.ఇదిలావుండగా  ది వారియర్ సినిమా ఫలితం లింగుస్వామి కెరీర్ కు కీలకం కానుంది.

ఇక ఈ సినిమాతో హీరో రామ్ కోలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పరిచయం కానున్నారు.అయితే  రామ్ ఈ సినిమా కోసం తన లుక్ ను పూర్తిస్థాయిలో మార్చుకున్నారు.ఇక ఆది పినిశెట్టి ఈ సినిమాలో విలన్ రోల్ లో నటించగా ట్రైలర్ లో ఆది ఊరమాస్ లుక్ లో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే.ఇకపోతే  నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మించగా విడుదలకు ముందే ఈ సినిమా నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది.కాగా  ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది...!!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: