బాలకృష్ణ సినిమా మరింత ఆలస్యం కానుందా..!!

P.Nishanth Kumar
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ముగింపు దశకు వచ్చిన ఈ సినిమా యొక్క షూటింగ్ ను త్వరలోనే పూర్తి చేసి ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు చిత్రాన్ని తీసుకురావాలని చిత్ర బృందం యొక్క ఆలోచన. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ అలాగే టీజర్ విడుదల కాగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై అంచనాలను భారీ స్థాయిలో పెంచాయి.

అఖండ సినిమా సంచలన విజయం అందుకోవడంతో ఈ చిత్రంపై ఆ రకమైన ఒత్తిడి కూడా గట్టిగానే ఉంది.  బాలయ్యకు మరో అఖండ విజయం ఈ సినిమా తెచ్చిపెడుతుందని నమ్మకాన్ని అందరూ వ్యక్తపరుస్తున్నారు. ఆ విధంగా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఎంతగానో ఆసక్తిని పరుస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన విదేశీ షెడ్యూల్ పూర్తి చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉండగా అమెరికా వెళ్లేందుకు అన్ని మొదట ప్లాన్ చేశారు కానీ కొన్ని రోజులుగా వీసా ఇష్యూ అవుతూ ఉండడంతో కొందరు యూనిట్ సభ్యులకు విశా సమస్య రావడంతో ఇతర కారణాలవల్ల మొత్తానికి ఈ షెడ్యూల్ క్యాన్సిల్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

 అమెరికాలో షూట్ చేయాలనుకున్న షెడ్యూల్ను ఇప్పుడు టర్కీలో చేయబోతున్నారని అంటున్నారు. త్వరలోనే టర్కీ వెళ్లి అక్కడ మిగిలిన షూటింగ్ యొక్క బాగానే పూర్తి చేయనున్నారు. ఇక బాలయ్య ఇటీవల కరోనా నుండి కొలుకోగా హైదరాబాదులో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతుంది ప్రస్తుతం టర్కీ షెడ్యూల్ కోసం బాలయ్య కూడా సిద్ధం అవుతూ ఉండగా ఈ ట్రిప్పుకు సంబంధించిన ఏర్పాట్లలో చిత్ర బృందం మునిగి ఉంది . తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ తన తదుపరి సినిమా చేయనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: