పవన్ కు సహాయం చేసిన తల్లి అంజనమ్మ..!!
ఇక వీరందరితో పాటుగా నాగబాబు పద్మజా పవన్ సోదరి మాధవి తమ ఇతర కుటుంబ సభ్యులు కూడా పవన్ కళ్యాణ్ జనసేన కౌలు రైతు భరోసా కు అందించారు. అయితే ఇప్పుడు పవన్ తల్లి అంజనాదేవి కూడా తన వంతు సహాయంగా రూ.1.50 లక్ష్యాలను కౌలు రైతు భరోసా కు ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాదులో పవన్ కు ఆమె విరాళం చెక్కులు అందజేసింది. తన భర్త కొణిదల వెంకట్రావు జయంతి సందర్భంగా ఈ విరాళాన్ని ఇచ్చినట్లుగా అంజనాదేవి తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తన తండ్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయ్యారు అనే విషయాన్ని గుర్తు చేశారు. తండ్రి ఎక్సైజ్ శాఖలో పని చేశారని ఆయన కు వచ్చిన జీతంతోనే తామంతా ఇలా పెరిగే అని తెలియజేశారు కానీ 2007లో తన తండ్రి మరణించారు అప్పటినుంచి తన తల్లి పెన్షన్ తోనే ఈ డబ్బులు దాచి సహాయ కార్యక్రమానికి ఇవ్వడం తన తల్లికి అలవాటే అని తెలియజేసారు. ఇందులో భాగంగానే ఇవ్వాల కౌలు రైతు భరోసా యాత్ర ప్రత్యేకమైన నిధి విరాళంగా ఇవ్వడం జరిగింది.. తన విశాల హృదయం మైన మనసుతో చేసిన ఈ పనికి తనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని తెలిపారు.