SVP : వీక్షించిన సీఎం దంపతులు.. వైఎస్ భారతి ప్రశంసలు!

Purushottham Vinay
ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా హంగామా మాత్రమే కనిపిస్తుంది. మే 12 వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటికి మంచి వసూళ్లతో రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతుంది.బాక్సాఫీస్ దగ్గర ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన సర్కారు వారి పాట సినిమా రానున్న రోజులలో మరింత అలరించనుందని అంటున్నారు. అయితే ఈ సినిమాని చాలా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమాకు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించాడు.ఎన్నో భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన సర్కారు వారి పాట సినిమాకి సామాన్యులు బ్రహ్మ రథం పడుతుంటే సినిమా సెలబ్రిటీలు మాత్రం నోరు విప్పట్లేదు. బహుశా అసూయతో కావొచ్చు.అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లోనే పవర్ ఫుల్ సెలెబ్రెటీ అయిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి వైఎస్ భారతి  వీక్షించారు.


వై.ఎస్.భారతి సర్కారు వారి పాట సినిమా రివ్యూ కూడా ఇచ్చారు..ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలంటే నాకు చాలా ప్రత్యేకమైనవని.. తప్పకుండా ఆయన సినిమాలు చూస్తానని ఆమె తెలియజేశారు.. సర్కారు వారి పాట సినిమా చూశానని ఈ సినిమా చాలా బాగుందని ఫ్యామిలీ ఆడియన్స్ కు కచ్చితంగా నచ్చుతుందని ఆమె అన్నారు.ముఖ్యంగా డబ్బు విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారి యాక్షన్ చాలా బాగుందని ఆమె ఆయనపై ప్రశంసలు కురిపించారు.సర్కారు వారి పాట సినిమాలో నాకు ఎంతో ఇష్టమైన డైలాగ్ మహేష్ బాబు గారు పలకడం చాలా సంతోషాన్ని కలిగించిందని ఆమె అన్నారు.నేను ఉన్నాను నేను విన్నాను అనే డైలాగ్ సర్కారు వారి పాట ట్రైలర్ రావడంతోనే సినిమా పై చాలా హైప్ క్రియేట్ అయ్యింది. ఇక సర్కారు వారి పాట సినిమా ప్రపంచవ్యాప్తంగా 160 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించగా.. 115 కోట్లకు పైగా షేర్ వసూళ్ళని సాధించి రికార్డు స్థాయిలో హిట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: