మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా , ఈ సినిమాలో అంజలి , సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమా ఇప్పటికే కొంత భాగం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరిగినా కూడా ఈ సినిమాకు లీకుల బెడద మాత్రం తప్పడం లేదు. అప్పట్లో ఈ చిత్ర బృందం రాజమండ్రి లో షూటింగ్ చేయగా పంచ కట్టు లుక్ ఒకటి లీక్ అయ్యింది. ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. అప్పట్లో ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. అలాగే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ అమృత్ సర్ లో జరిగింది. అక్కడ కాలేజీ సన్నివేశాలను చిత్ర బృందం చిత్రీకరించింది. అక్కడి కాలేజీ సీన్స్ కూడా లీక్ అయ్యాయి.
ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు వైజాగ్ లో కూడా లీకుల బెడద తప్పలేదు. తాజాగా వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన వీడియో ఒకటి లీక్ అయ్యింది. ఈ వీడియోలో లో రాము చరణ్ నడి రోడ్డుపై చిందులు వేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో నడి రోడ్డుపై ట్రాఫిక్ పోలీస్ తో రామ్ చరణ్ గొడవ పడినట్టుగా కనిపిస్తోంది. ఇలా ఇలా 'ఆర్ సి 15' మూవీ కి ఎక్కడికి వెళ్లినా లీకుల బెడద మాత్రం తప్పడం లేదు.