ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అరవింద్ ఎన్నో హిట్ , సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి నిర్మాతగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇలా నిర్మాతగా తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న అల్లు అరవింద్ తాజాగా నిర్మించిన గని మరియు జెర్సీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. వరుణ్ తేజ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన గని సినిమా ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైన బాక్స్ ఈఫిస్ దగ్గర బోల్తా కొట్టింది.
ఈ సినిమాతో పాటు హిందీలో షాహిద్ కపూర్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన జెర్సీ సినిమాతో కూడా అల్లు అరవింద్ ఫ్లాప్ ను అందుకున్నాడు. ఇలా ఈ రెండు సినిమాల ద్వారా వరుసగా ఫ్లాప్ లను ఎదుర్కొన్న అల్లు అరవింద్ ఒక కొత్త ప్లాన్ తో తిరిగి పొంద పోతున్నట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్న చిన్న హీరోలతో సినిమాలను తెరకెక్కించి తక్కువ బడ్జెట్ తో సినిమాను పూర్తి చేసి లాభాలను అందుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అసలు విషయంలోకి వెళితే... డిజే టిల్లు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ హీరోగా మారిపోయిన సిద్ధు జొన్నలగడ్డ హీరోగా అల్లు అరవింద్ ఒక సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆకాశంవనంలో అర్జున కళ్యాణం సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చిన విశ్వక్ సేన్ హీరోగా అల్లు అరవింద్ ఒక సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా మంచి ఫామ్ లో ఉన్న ఇద్దరు చిన్న హీరోలతో సినిమాలను అల్లు అరవింద్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.