పూజ హెగ్డే కి అక్కడ కలిసి రావట్లేదా..!!

P.Nishanth Kumar
తమిళ సినిమాతో కెరీర్ ను ప్రారంభించిన పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే టాలీవుడ్ లో ఇప్పుడు అగ్ర హీరోయిన్ గా వెలుగొందుతోంది. ఇప్పుడు ఈ అమ్మడికి తెలుగు లో తిరుగు లేదని చెప్పవచ్చు. తొలినాళ్ళలో హిందీ లో భారీ పరాజయంతో పలకరించిన పూజకు ఇప్పుడిప్పుడే బాలీవుడ్ నుంచి మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే తనను హీరోయిన్ చేసిన ఇండస్ట్రీలో మాత్రం  నిలదొక్కుకోలేక పోతుంది. దాదాపు పదేళ్ల తర్వాత ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టింది. విజయ్ దళపతి వంటి స్టార్ హీరో పక్కన ఆమెకు ఛాన్స్ రావడంతో తమిళనాట కూడా ఈమె రచ్చ మొదలైంది అని అందరూ అనుకున్నారు.

అలా వారిద్దరూ కలిసి నటించిన బీస్ట్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజా కూడా తన కెరియర్ కోలీవుడ్ లో ఊపందుకోవడం ఖాయం అని భావించింది. దానికి తగ్గట్లుగానే ఈ చిత్రం యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో  ఎంతో హుషారుగా పాల్గొంది. అయితే ఈ సినిమా నిరాశ పరచడంతో ఒక్కసారిగా అందరి ఆమె అభిమానులకు నిరాశ ఎదురయింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ ఫ్లాప్ అవడంతో ఆమె కోలీవుడ్ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది.  పూజా హెగ్డే తమిళ్ లో చేసిన రెండు సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో ఆమెను ఐరెన్ లెగ్ గా విమర్శిస్తున్నారు.

చేసిన రెండు సినిమాలు ఫ్లాప్  చేసిందని ఆమె పై కామెంట్స్ చేస్తున్నారు. దీనికి రెబల్ స్టార్ అభిమానులు కూడా తోడవడంతో పుండు మీద కారం చల్లినట్లు అయ్యింది. ప్రభాస్ తో ఆమె కలిసి నటించిన రాధే శ్యామ్ చిత్రం డిజాస్టర్ గా మిగిలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డార్లింగ్ ఫ్యాన్స్ విజయ్ అభిమానులతో కలిసి వంత పడుతూ ఆమె పై విమర్శలు చేస్తున్నారు. ఇంకొకవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం పూజా హెగ్డే కు సపోర్ట్ గా నిలుస్తూ వాళ్లకు కౌంటర్ లు ఇస్తున్నారు. వీరు కలిసి రెండు సినిమాలలో నటించగా అవి సూపర్ హిట్స్ అయ్యాయి. ఏదేమైనా టాలీవుడ్ రేంజ్ లో పూజా కోలీవుడ్ లో సరైన హిట్స్ చేయలేకపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: