'కేజీఎఫ్' ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే పార్ట్-3 కూడా..?

Anilkumar
సినీ అభిమానులు ఎంతో కాలం నుండి  ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది కే జి ఎఫ్ 2.అయితే 'కేజీఎఫ్ 2' ఎట్టకేలకు గురువారం విడుదలైంది. ఇక ఈ సినిమా కన్నడ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చింది.అయితే బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ టాక్ సొంతం చేసుకుని రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. ఇక అసలు విషయం ఏమిటంటే  'కేజీఎఫ్2'కి చివరిలో కొనసాగింపుగా 'కేజీఎఫ్3' కూడా ఉండబోతుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ పరోక్షంగా ఓ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇదిలావుంటే తాజాగా  ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అంతేకాకుండా అలానే అందులో ఈ సారి స్టోరీ ఎక్కడ జరగబోతుందో కూడా చెప్పేశారనే చెప్పాలి. ఇకపోతే ఇంతవరకూ ఇండియాలోనే జరిగిన 'కేజీఎఫ్' కథ ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండబోతుందని సమాచారం. అయితే అందుకే 'కేజీఎఫ్ 2' చిత్రం చివరిలో రాకీభాయ్ వస్తుంటే.. అతడి షిప్ను అమెరికా, ఇండోనేషియా దేశాలకు చెందిన అధికారులు వెంటాడుతున్నట్టు చూపించారు. అంతేకాదు రాకీభాయ్ సామ్రాజ్యం విదేశాలలో కూడా విస్తరించినట్లు చూపించారు. ఇక దాంతో పాటు రాకీ మీద భారత ప్రధానికి అమెరికా ఫిర్యాదు చేసినట్లు ఉంటుంది.ఇకపయో వీటిని చూసిన సిని ప్రేక్షకులు 'కేజీఎఫ్'కి పార్ట్ 3 కూడా రాబోతోందని నెట్టింట రచ్చ చేస్తున్నారు.

ఇదిలావుంటే ఇప్పుడు  ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ డార్లింగ్‌ ప్రభాస్‌తో చేస్తున్న 'సలార్‌' రెండు భాగాలుగా రానున్నట్టు తెలుస్తోంది.అయితే  ఆ చిత్రం ఓ కొలిక్కి వచ్చిన తరవాత 'కేజీఎఫ్' పార్ట్ 3 పై మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.ఇకపోతే   దీనిపై అధికారికి ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ సినిమా మొదటి రోజే ఏకంగా 130 కోట్ల గ్రాస్  కలెక్ట్ చేసినట్లు ట్రేడ్  వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

KGF

సంబంధిత వార్తలు: