అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి కృతి శెట్టి 'ఉప్పెన' మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు కృతి శెట్టి కి కూడా మంచి గుర్తింపును తీసుకుని వచ్చింది, ఇలా ఉప్పెన మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్న కృతి శెట్టి ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంది. అందులో భాగంగా కృతి శెట్టి నటించిన బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలు ఇప్పటికే విడుదలయ్యి మంచి విషయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి, ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన మూడు సినిమాలు కూడా వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి.
ఇలా వరుస విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న కృతి శెట్టి ప్రస్తుతం కూడా వరుస సినిమాల్లో నటిస్తోంది, అందులో భాగంగా కృతి శెట్టి ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న ది వారియర్ , నితిన్ హీరోగా తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలతో పాటు సూర్య హీరోగా బాలా దర్శకత్వంలో తెరకెక్కబోయే కోలీవుడ్ సినిమాలో కూడా కృతి శెట్టి అవకాశాన్ని దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఈ సినిమా లతో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా , మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కూడా కృతి శెట్టి అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లి తెరకెక్కబోతున్న సినిమాలో ముగ్గురు హీరోయిన్ లు ఉండబోతున్నట్లు తెలుస్తుంది, అందులో ఒక హీరోయిన్ గా కృతి శెట్టి ని చిత్ర బృందం ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.