నిజం చెప్పాలంటే అంటూ.. ఆ విషయం చెప్పేసిన జాన్వికపూర్?

praveen
ఇటీవలే పుట్టిన రోజు సందర్భం గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఏకంగా మెట్ల మార్గం ద్వారా సప్తగిరి చేరుకొని ఇక స్వామివారి ఆశీస్సులు పొందారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన జాన్వికపూర్ పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అమ్మకు తిరుమల క్షేత్రం అంటే ఎంతో ఇష్టం.. ఏడుకొండలస్వామి అంటే ఎంతో నమ్మకం.. నాకు కూడా అంతే అంటూ జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.

 ఈ మధ్య కాలంలోనే కరోనా వైరస్ బారినపడి బయటపడ్డాను అందుకే స్వామివారి ఆశీస్సులు కోసం వచ్చాను. కాలి నడకను వచ్చి స్వామి వారిని దర్శించుకోవడమే ఈ ఏడాది పుట్టినరోజు ప్రత్యేకత అంటూ జాన్వికపూర్ చెప్పుకొచ్చింది. ఇక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నాలుగేళ్లు అయింది గొప్పగా ఏదో సాధించానని చెప్పను.. కానీ చాలా నేర్చుకో గలిగాను.. ఒక నటిగా వ్యక్తిగా ఎదిగాను అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను అంటూ జాన్వికపూర్ తెలిపింది.

 నా చెల్లి ఖుషి కపూర్ నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి నా సలహాలు సూచనలు తప్పకుండా ఉంటాయి అని  అనుకుంటారు ప్రతి ఒక్కరు.. కానీ వాస్తవానికి నిజం చెప్పాలంటే కొన్ని విషయాల్లో నా కంటే తనే బెటర్.. పరిస్థితులను అర్థం చేసుకుని దాని వెనుక ఉన్న సమస్యలను పరిష్కరించడంలో మానసిక పరిపక్వత విషయంలో కూడా ఖుషి కపూర్ నాకు అక్క లాంటిది అంటూ జాన్వికపూర్ చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం రెండు చిత్రాల షూటింగ్ పూర్తయిందని.. మరికొన్ని రోజుల్లో ప్రేక్షకులను అలరించబోతున్నా అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.కాగా ప్రస్తుతం దివంగత నటి శ్రీదేవి కూతురు గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన జాన్వికపూర్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. గ్లామర్ పాత్రల్లో కూడా నటిస్తూ అభిమానులను అలరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: