మణిరత్నం ఎప్పుడు చేసేశావయ్యా..!!

P.Nishanth Kumar
దక్షిణాది సినిమా పరిశ్రమలో దర్శకుడిగా ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరిస్తున్నాడు దర్శకుడు మణిరత్నం. తన కెరీర్ ని మొదలు పెట్టి 30 సంవత్సరాలు అవుతున్నా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరిస్తున్నాడు. ఆ విధంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాల జాతర కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కూడా ఆ తరహా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. మార్చి 11వ తేదీన పాన్ ఇండియా సినిమా మొదలు కాబోతుంది. మొదటగా రాధే శ్యామ్ చిత్రం విడుదల కాబోతున్నగా ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించడం విశేషం. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుత ఉండగా సినిమాలో విక్రమ్ కార్తి త్రిష ఐశ్వర్యరాయ్ స్టార్స్ నటిస్తున్నారు.రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. లైకా మరియు మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్తో ఇండియన్ స్క్రీన్ పై గతంలో ఎప్పుడు చూడని విధంగా సరికొత్త కథతో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు.

 ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది అయితే ఇంత పెద్ద భారీ సినిమాలు చేస్తున్నట్లుగా కనీసం ఒక అప్డేట్ కూడా రాలేదు అని తెలుగు సినిమా ప్రేక్షకులు చెబుతున్నారు. ఇంత పెద్ద సినిమాను ఎప్పుడు పూర్తి చేశాడు అప్పుడే విడుదలకు కూడా సిద్ధం చేశాడు అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చోళ రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుందని పదవ శతాబ్దం నేపథ్యంలో సాగే కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు గా తెలుస్తుంది.  రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి కుటుంబాల మధ్య జరిగిన సమరం నేపథ్యంలో ఈ కథను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: