NBK 107 : అభిమానులకి ఇక పూనకాలే!

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోస్ ఇంకా ఎంతమంది యంగ్ హీరోస్ ఉన్న బాలయ్య బాబు క్రేజ్ మాత్రం పెరగడమే తప్ప అసలు తరగనే తరగదు. ఇక ఈమధ్య అఖండ లాంటి సూపర్ నాచురల్ పవర్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అలాగే క్రాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫాంలోకి వచ్చిన గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో ఫస్ట్ టైం రాబోతున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాకపోయినా ఇప్పటికే రిలీజైన లుక్ వల్ల ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో పెరిగాయి.అఖండ సినిమా తర్వాత బాలయ్య కెరీర్ లో ఆ రేంజ్ హిట్ గా ఈ సినిమా నిలుస్తుందని నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో భావిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ అనేది ఇప్పుడు ఇంటర్నెట్ లో లీకైంది.శృతిహాసన్ ఈ సినిమాలో  హీరోయిన్ రోల్ లో నటిస్తుండగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.


తెలంగాణలోని సిరిసిల్లలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. గోపీచంద్ మలినేని యాక్షన్ ఎపిసోడ్ తో ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చెయ్యడం అనేది గమనార్హం. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో తండ్రీకొడుకులుగా కనిపిస్తారని సమాచారం అనేది తెలుస్తుంది. తన జనాల క్షేమం కోసం నీటి సమస్యపై పోరాడే పాత్రల్లో తండ్రీకొడుకు కనిపిస్తారని సమాచారం అనేది తెలుస్తోంది.ఇక ఈ కథ బాలయ్య ఫ్యాన్స్ కి ఎంతగానో నచ్చింది. ఖచ్చితంగా మరో ఊర మాస్ బ్లాక్ బస్టర్ ఖాయమని బాలయ్య ఫ్యాన్స్ నమ్ముతున్నారు.అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బ్రేక్ చేయగా ఈ సినిమా కూడా దాని లాగే రికార్డులను బ్రేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.


మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ సినిమాలో అన్ని హంగులు ఉన్నాయని సమాచారం అందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి. బాల కృష్ణ సక్సెస్ ట్రాక్ ను అఖండ లాగే కొనసాగించాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: