అస్సలు తగ్గేదే లే అంటున్న అమెజాన్ ప్రైమ్..!

murali krishna
కరోనా మొదలైనప్పటి నుండి ఓటీటీ హవా తెగ నడుస్తుంది. అమెజాన్ మరియు నెట్ ఫ్లిక్స్‌లో పెద్ద పెద్ద సినిమాలు క్యూ కడుతున్నాయట.వెంకటేష్‌, మోహన్ లాల్, సూర్య వంటి స్టార్స్ తమ సినిమాలని డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేసినసంగతి అందరికి తెలిసిందే

రానున్న రోజులలో మరి కొన్ని తెలుగు సినిమాలు ఓటీటీలో సందడి చేయబోతున్నాయట . అయితే అతి త్వరలో విడుదల కానున్న మూడు పెద్ద సినిమాలకు సంబంధఙంచిన ఓటీటీ రైట్స్ అమెజాన్ దక్కించుకున్నట్టు సమాచారం..

సర్కారు వారి పాట, ఆచార్య అలాగే కేజీఎఫ్ 2 చిత్రాలు త్వరలో థియేటర్స్‌లో విడుదల కానుండగా,ఈ మూడు సినిమాల ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్టు సమాచారం.. ఇప్పుడు విక్రమ్‌ కూడా తన సినిమాలని ఓటీటీలో విడుదల చేయబోతున్నాడరట.ఈయనకు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉందట ఇక్కడ కూడా ఆయన సినిమాలకు బాగా మార్కెట్ ఉంది. అపరిచితుడు సినిమాతో టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడట విక్రమ్.

అయితే ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఆ స్థాయి విజయం ఈయనకు మాత్రం రాలేదు. కానీ విక్రమ్ నటించిన చాలా సినిమాలు తెలుగులోనూ ఎప్పుడు విడుదలవుతూ వచ్చాయి. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు ట తమిళంలో కూడా కమర్షియల్ విజయం అందుకుని చాలా రోజులు అయిపోయింది. అక్కడ కూడా 15 ఏళ్ళుగా విక్రమ్ సరైన బ్లాక్‌బస్టర్ కోసం చూస్తూనే ఉన్నాడట.

థియేటర్స్‌లో విడుదలైన సినిమాలకు ఇప్పుడు పరిస్థితులు అస్సలు బాగోలేవు. అందుకే మంచి ఓటిటి రేటుకు తన సినిమాలను ఓటిటికి ఇచ్చేస్తున్నాడట.విక్రమ్. ఇప్పటికే తమిళంలో ధనుష్, సూర్య లాంటి స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను డిజిటల్ విడుదల చేసారు. సూర్య అయితే వరసగా రెండు సినిమాలను అక్కడే విడుదల చేసి క్యాష్ చేసుకున్నాడట.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాలు ఓటిటిలో అద్భుతమైన విజయం అందుకున్నాయట.. దాంతో పాటు ధనుష్ జగమే తంత్రంకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆర్య సార్పట్ట అదిరిపోయే వ్యూస్ అందుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: