ప్రేమ పెళ్లి చేసుకున్న 5 గురు డైరెక్టర్స్ వీళ్ళే... ?
* టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ఆయన భార్య – రమా రాజమౌళి, వీరిది ప్రేమ వివాహం. అయితే వీరిదో డిఫరెంట్ లవ్ స్టోరీ. రమాకు ముందుగానే వివాహం అయ్యి 9 ఏళ్ల కొడుకు ఉన్న సమయంలో ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమెను ప్రేమించిన డైరెక్టర్ రాజమౌళి పెద్దలను ఎదిరించి రమా గారిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.
* మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన పూరి జగన్నాథ్ సైతం ప్రేమ వివాహం చేసుకున్నారు. పూరి తన కెరియర్ ఆరంభంలో దూరదర్శన్ లో పనిచేసే సమయంలో అక్కడ లొకేషన్ కోసం ఒక ఇంటికి వెళ్ళగా లావణ్యను చూసి ప్రేమించి పెద్దలలో మాట్లాడి ఆమెను వివాహం చేసుకున్నాడు.
* హీరోయిన్ రమ్య కృష్ణ , దర్శకుడు కృష్ణ వంశీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చంద్ర లేఖ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు, ఆ తరవాత పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
* దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా శ్రీ విధ్య అనే ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు.
* డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ సమయంలో నిర్మాత ప్రియాంక దత్ తో ప్రేమలో పడి అనంతరం వివాహం చేసుకున్నారు.
ఇలా పలువురు టాలీవుడ్ డైరెక్టర్స్ ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని సాఫీగా తమ జీవితాలను కొనసాగిస్తున్నారు...