అఖండ : ఆ సాంగ్ రికార్డు వ్యూస్తో హల్చల్..!
ముఖ్యంగా జై బాలయ్య పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నది. ప్రగ్యాజైస్వాల్తో పోటీ పడీ మరీ బాలకృష్ణ ఈ పాటకు స్టెప్పులు వేసారు. ఇదిలా ఉండగానే చిత్ర యూనిట్ తాజాగా ఈ పాట ఫుల్ వీడియోను విడుదల చేసింది. తమన్ సంగీతం, అనంత శ్రీరామ్ రచన బాలకృష్ణ అభిమానుల్లో హుషారు పెంచింది. ఈ పాటను గీతమాధురి, సాహితి చాగంటి, సత్యయామిని, అదితి భవరాజు పాడారు.ఇదిలా ఉండగా ఈ పాటను ఇలా విడుదల చేశారో లేదో.. అలా వైరల్గా మారింది. విడుదల చేసిన కేవలం కొద్ది గంటల్లోనే యూట్యూబ్లో వ్యూస్తో దూసుకుపోతుంది. అఖండ చిత్రం ఈనెలలోనే ఓటీటీ వేదికగా సందడి చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసినదే. డిస్నీ+హాట్స్టార్ వేదికగా అఖండ రానున్నది.
బాలకృష్ణ వరుసగా అటు సినిమాలు చేసుకుంటూ.. ఇటు బుల్లితెరపై టాక్షోలతో బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు రాజకీయాల్లో కూడా రాణిస్తుననారు. హిందూపురం ఎమ్మెల్యేగా రెండుసార్లు విజయం సాధించారు బాలకృష్ణ. ఇక ఆహా ఓటీటీ ప్లాట్ఫాంలో చేస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే టాక్ షో ఎలా దూసుకుపోతుందో చూస్తూనే ఉన్నాం. వరుస క్రేజీ దర్శకులతో సినిమాలు చేయనున్నాడు. బాలయ్యలైనప్లో ఉన్న దర్శకులను చూస్తే అఖండ తరువాత గోపిచంద్ మలినేనితో ఓ సినిమా చేయనున్నారు. క్రాక్ తరువాత గోపిచంద్ మలినేని దర్శకత్వం చేస్తున్న సినిమా ఇదే. ఈ సినిమా పూర్తికాగానే పూరిజగన్నాథ్, అనీల్రావిడి సినిమాలు లైన్లో ఉన్నాయి. ఆ తరువాత క్రిష్తో మరొక సినిమా కూడా ఉంది. క్రేజీ దర్శకుల కాంబోలో వస్తున్న సినిమాలు కావడంతో వీటిపై భారీ అంచనాలున్నాయి. ఏదీ ఏమైనా ఇక బాలయ్య వరుస సినిమాలతో బిజీ కానున్నాడు.