ఏందిది థమన్ అన్నా : సర్కారు వారి 'పాట' జనవరిలో ఇంతకీ ఎప్పుడన్నా ... ??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్, సూపర్ హీరోయిన్ కీర్తి సురేష్ ల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. యువ దర్శకుడు పరశురామ్ తీస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, సముద్రఖని, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలు చేస్తుండగా మది ఛాయాగ్రాహకుడిగా అలానే ఎస్ థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవల చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఈ ఏడాది మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయి అందరి నుండి మంచి స్పందన అందుకుంది.
మహేష్ బాబు తన కెరీర్ లో ఇప్పటివరకు పోషించని ఒక డిఫరెంట్ పాత్ర ఈ సినిమాలో చేస్తున్నారని, తప్పకుండా సర్కారు వారి పాట రిలీజ్ తరువాత మహేష్ ఖాతాలో మరొక సూపర్ హిట్ గా నిలవడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక ఇటీవల మహేష్ బాబు మోకాలికి సర్జరీ జరగడంతో ఈ మూవీ షూట్ కి బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఫ్యామిలీ తో సహా దుబాయ్ లో రెస్ట్ తీసుకుంటున్న మహేష్ బాబు జనవరి నెలాఖరులో ఇండియా తిరిగివస్తారని, ఫిబ్రవరి మొదటి వారంలో సర్కారు వారి బ్యాలన్స్ షూట్ మొదలెట్టనున్నారని సమాచారం.
అయితే విషయం ఏమిటంటే ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ని జనవరి లో రిలీజ్ చేస్తాం అంటూ ఇటీవల యూనిట్ తో పాటు సంగీత దర్శకడు థమన్ కూడా పలు సందర్భాల్లో చెప్పారు. అయితే ప్రతి ఒక్కరు జనవరి అని అంటున్నారే తప్ప పక్కాగా సాంగ్ ఎప్పుడు విడుదలవుతుంది అనేది మాత్రం వెల్లడించడం లేదని, ఇప్పటికే తాము తమ సూపర్ స్టార్ సినిమా కోసం రెండేళ్లుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం అని, కావున ఇకనైనా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్పందించి ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని కోరుతూ పలువురు మహేష్ బాబు ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై థమన్ కానీ, సర్కారు వారి పాట టీమ్ కానీ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా ఈ సినిమా ఏప్రిల్ 1న విడుదల కానున్న విషయం తెల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: