ఆమెకు ఓకే చెప్పిన నాగచైతన్య..!
నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూస సినిమా చేస్తున్నారు. అలాగే తండ్రి నాగార్జునతో కలిసి నటిస్తున్న సినిమా 'బంగార్రాజు'లో తన పోర్షన్ కంప్లీట్ చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్లో ‘లాల్ సింగ్ చద్దా’ మూవీలో చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఇలా ఉండగానే తాజాగా డైరెక్టర్ నందినీ రెడ్డితో మరో మవీకి ఓకే చెప్పారనట నాగచైతన్య. ఇటీవలే నాగచైతన్యకు నందిని రెడ్డి ఓ కథ వినిపించిందని, అది చైతూకి నచ్చడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా సీనియర్ ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ బ్యానర్పై నిర్మితమవుతుందని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కాగా, నాగచైతన్యతో నందినీ రెడ్డి చేయనున్న ఈ స్టోరీ గతంలో విజయ్ దేవరకొండ కోసం రాసి పెట్టిన కథ అనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నందినీ రెడ్డి సంతోష్ శోభన్తో `అన్నీ మంచి శకునములే` అనే మూవీ చేస్తోంది.