ఆ బలహీనతతోనే ఇబ్బంది పడ్డానంటున్నా బాబూమోహన్..!
ఇందులో భాగంగా తాను తప్పులను అస్సలు సహించనని చెప్పినట్లు తెలుస్తుంది.అందువల్లనే తాను పదవిలో ఉన్నప్పుడు కొంతమంది అధికారులు పేద ప్రజల విషయంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించినప్పటికీ తాను మాత్రం అస్సలు సహించకుండా కచ్చితంగా ప్రజలకు న్యాయం చేకూర్చేందుకు కృషి చేశానని చెప్పుకొచ్చారట.ఈ క్రమంలో కొందరు అధికారులకు ఈ విషయం నచ్చక తన గురించి లేనిపోని ప్రచారం చేశారని చెప్పుకొచ్చాడనీ తెలుస్తుంది. అలాగే తాను ప్రజలను చాలా సులభంగా నమ్ముతానని ఈ క్రమంలో కొందరు తనని మోసం చేయడానికి కూడా యత్నించారని తెలిపాడట.ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసేటటువంటి యాంకర్ మీ రాజకీయ జీవితంలో భాగంగా దాదాపుగా మూడు పార్టీలు మారి మళ్లీ ఇప్పుడు బిజెపి పార్టీ కండువా ఎందుకు కప్పుకున్నారంటూ ప్రశ్నించాడనీ సమాచారం.
దీంతో బాబు మోహన్ ఈ విషయంపై స్పందిస్తూ తాను రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు స్వర్గీయ నటుడు మరియు నటసార్వభౌముడు అయిన నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరానని ఆ సమయంలో బిజెపి పార్టీ తెలుగుదేశం పార్టీకి చాలా సహాయం చేసిందని చెప్పారట.అప్పటి ప్రధాన అటల్ బిహారీ వాజ్ పై ప్రజల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఆ కారణంగానే తాను బిజెపి పార్టీలో చేరానని చెప్పుకొచ్చాడట. ఈ విషయం ఇలా ఉండగా నటుడు బాబు మోహన్ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి తన సినీ కెరీర్ ని వదులుకున్నాడనీ తెలుస్తుంది.. అయితే ప్రస్తుతం సినిమా పరిశ్రమ నుంచి బాబు మోహన్ దూరంగా ఉన్నప్పటికీ ఆయన నటించిన కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ సినీ ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయనీ తెలుస్తుంది.