ఇంకొంచెం గట్టిగా దృష్టి పెట్టి ఉంటె బాగుండేదేమో భాస్కరా .... ??

GVK Writings
అఖిల్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. భాస్కర్ తీసిన ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 సంస్థపై బన్నీ వాసు, వాసు వర్మ, అల్లు అరవింద్ కలిసి నిర్మించగా గోపి సుందర్ సంగీతం అందించారు. ఇక ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముంధకు వచ్చిన విషయం తెల్సిందే. అయితే మొత్తంగా ఎప్పటినుండో మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కి ఈ మూవీ బాగానే సక్సెస్ ని అందించిందని చెప్పాలి.
నిజానికి సినిమా మొత్తంగా బాగానే ఉన్నప్పటికీ మధ్యలో పలు సన్నివేశాల్లో ఎమోషన్స్ పెద్దగా పండలేదని, అలానే మాస్, యాక్షన్ అంశాలు కోరుకునే వారికి, ఇక బి, సి సెంటర్ ఆడియన్స్ కి ఈ మూవీ పెద్దగా నచ్చదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే క్లాస్ ఆడియన్స్ తో పాటు ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ సినిమాకి మంచిగా కనెక్ట్ అయ్యారు. గత మూవీస్ తో పోలిస్తే అఖిల్ ఈ సినిమాలో మరింత పరిణితి చెందిన నటనని కనబడిచాడని, అలానే హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే తన పాత్ర కి చక్కగా ఒదిగిపోయి యాక్ట్ చేసారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గోపి సుందర్ అందించిన సాంగ్స్ తో పాటు ఆకట్టుకునే విజువల్స్, ఎంటర్టైన్మెంట్ వంటివి ఈ సినిమాకి మంచి ప్లస్ కాగా, మధ్యలో కొంత సాగతీత సన్నివేశాలు, అలానే సరిగ్గా ఆకట్టుకోని ఎమోషనల్ సన్నివేశాల విషయంలో దర్శకుడు భాస్కర్ కనుక మరింతగా జాగ్రత్తలు తీసుకుని ఉన్నట్లయితే ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి ఉండేదనేది మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయయం. అయితే ఓవరాల్ గా అక్కినేని అఖిల్ కి మంచి సినిమా దక్కడంతో ఆయన ఫ్యామిలీ తో పాటు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో పూర్తిగా చెప్పాలి అంటే రేపటి నుండి ఎదురయ్యే అసలు కలెక్షన్స్ పరీక్ష ని ఎదుర్కోవాలని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: