ప్రభాస్ ఫ్యాన్స్ కు బాడ్ న్యూస్ చెప్పిన నాగశ్విన్...!

murali krishna
పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ఇప్పుడు కేవలం తెలుగు స్టార్ హీరో మాత్రమే కాదని తెలుస్తుంది.ఆయన ఇంటర్నేషనల్ స్టార్ అని అందరికి తెలుసు. బాహుబలి తర్వాత ఆయన నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా లేవల్ లో మాత్రమే కాకుండా  అంతర్జాతీయంగా మంచి గుర్తింపును సాధిస్తున్నాయని తెలుస్తోంది.
ప్రభాస్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయని అందరికి తెలుసు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న 'రాధే శ్యామ్' చిత్రాన్ని. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటన చేసిన విషయం అందరికి తెలిసిందే. మరోవైపు ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో సలార్‌ మరియు ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్  అదే విధంగా సందీప్ రెడ్డి వంగాతో ' స్పిరిట్ ' అనే చిత్రాల్లో నటిస్తున్నాడని అందరికి తెలిసిన విషయమే.
మహానటి డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం. ఈ నెల 23 వ తేదీన ప్రభాస్ పుట్టిన రోజు సంధర్భంగా ఆయా చిత్రాలకు సంబంధించి అప్డేట్ ల కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది. అయితే నాగ్ అశ్విన్ మాత్రం ప్రభాస్ అభిమానులకు బాడ్ న్యూస్ చెబుతున్నాడని సమాచారం. ఇటీవల సోషల్ మీడియాలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు నాగ్ అశ్విన్ సమాధానం ఇచ్చాడని తెలుస్తుంది. ఆ ట్వీట్ లో ఏముందంటే … ప్రభాస్ బర్త్ డే కి అప్డేట్ ఏం లేదా అని అడగ్గా … ఆఫ్టర్ రాధే శ్యామ్ అని నాగ్ అశ్విన్ బదులిచ్చాడని సమాచారం. దీంతో వీరి కాంబినేషనులో వస్తున్న చిత్రానికి గాను ఏ అప్డేట్ లేదని ప్రభాస్ అభిమానులు ఫీల్ అవుతున్నారని తెలుస్తుంది.
ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించనున్నారని తెలుస్తుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మిస్తుండగా 500 కోట్లు బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన దీపికా పదుకొణెను తీసుకున్నారని అందరికి తెలిసిన విషయమే. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుండగా  ఈ సినిమాకు ప్రాజెక్ట్ కే అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయని ఇదివరకే తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: