సమ్ థింగ్ స్పెషల్ అంటున్న హీరోలు..!
సేమ్ టు సేమ్ ప్రభాస్ ఇలాగే వరుసగా యాక్షన్ మూవీస్ చేస్తున్నాడు. 'బాహుబలి'లో వారియర్లా భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న ప్రభాస్, ఆ తర్వాత 'సాహో'లో మాఫియా డాన్గా కనిపించాడు. ఇక 'రెబల్' తర్వాత ప్రభాస్ అన్నీ యాక్షన్ మూవీసే చేశాడు. దీంతో జర్నీ సమ్థింగ్ డిఫరెంట్గా ఉండాలని, లేడీ ఫ్యాన్స్ని ఇంప్రెస్ చెయ్యడానికి వింటేజ్ లవ్ స్టోరీ 'రాధేశ్యామ్' చేస్తున్నాడు.
జూ.ఎన్టీఆర్ 'ట్రిపుల్ ఆర్' నుంచి గేమ్ ప్లాన్ మొత్తం మార్చేశాడు. వరుసగా పాన్ ఇండియన్ మూవీస్కే సైన్ చేస్తున్నాడు. కొరటాల శివతో నేషనల్ లెవల్లో రిపేర్ చేస్తానని ఒక యాక్షన్ ఎంటర్టైనర్కి కమిట్ అయ్యాడు. అలాగే యాక్షన్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ నీల్తో ఒక మూవీ చెయ్యబోతున్నాడు. ఇక ఈ యాక్షన్ స్టోరీస్ తర్వాత అట్లీ డైరెక్షన్లో ఒక లవ్స్టోరీకి కమిట్ అయ్యాడట తారక్.
అల్లు అర్జున్ని టాలీవుడ్ మొత్తం స్టైలిష్ స్టార్గానే చూస్తుంది. మధ్యలో ఊరమాస్ అని 'సరైనోడు' సినిమా చేసినా బన్నిని స్టైలిష్ ఐకాన్గానే చూస్తున్నారు అభిమానులు. దీంతో ఆడియన్స్ని సర్ప్రైజ్ చెయ్యడానికి కంప్లీట్గా మేకోవర్ అయ్యాడు. రస్టిక్ లుక్తో 'పుష్ప' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో ఎర్రచందనం దొంగగా కనిపిస్తున్నాడు బన్ని.
రామ్ చరణ్ కెరీర్ స్టార్టింగ్ నుంచీ మాస్ మూవీస్తోనే ట్రావెల్ చేస్తున్నాడు. మధ్యలో 'ఆరెంజ్' అని లవ్స్టోరీలోకి వెళ్లినా, ఎక్కువగా కమర్షియల్ మూవీసే చేశాడు. అయితే ఇప్పుడు హిస్టారికల్ డ్రామా 'ట్రిపుల్ ఆర్' తర్వాత శంకర్తో ఒక పొలిటికల్ డ్రామాకి సైన్ చేశాడు చరణ్. ఈ మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ సమ్థింగ్ స్పెషల్గా ఉంటుందని చెప్తున్నారు. మొత్తానికి ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నాయి ఈ సినిమాలు.