వాళ్లను ఎంకరేజ్ చేస్తున్న చిరంజీవి !

NAGARJUNA NAKKA
మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్లను ప్రోత్సహిస్తున్నాడు. తన పుత్రుడు రామ్ చరణ్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడితో సినిమాకు ఓకే చెప్పాడు.  ఈ సినిమాపై ఇప్పటికే చర్చలు కూడా మొదలయ్యాయని టాక్ నడుస్తోంది. దీంతో ఓ మాస్ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మరి మెగాస్టార్‌ని దర్శకత్వం వహించబోతున్న సంపత్ నందిపై ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు.  
చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో చిరంజీవితో పాటు రామ్‌ చరణ్‌ కూడా నటించాడు. తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలో చిరు, చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా నటించారు.
అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి మళయాళీ హిట్‌ 'లూసిఫర్‌'ని 'గాడ్‌ ఫాదర్‌'గా రీమేక్ చేస్తున్నాడు. తమిళ మేకర్ మోహన్‌ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తమిళ హిట్‌ 'వేదళం'ని 'భోళా శంకర్‌'గా రీమేక్‌ చేస్తున్నాడు చిరు. ఈ మూవీతోనే మెహర్ రమేశ్ మళ్లీ 8 ఏళ్ల తర్వాత మెగాఫోన్ పడుతున్నాడు. ఈ మూవీస్‌తో పాటు బాబీ దర్శకత్వంలో ఒక మాస్ మూవీ చేస్తున్నాడు.
చిరంజీవి ఈ ప్రాజెక్ట్స్‌ తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. రీసెంట్‌గానే సంపత్ నంది 'సీటీమార్'తో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాడు. ఈ మూవీ టైమ్‌లోనే చిరుకి ఒక లైన్ నెరేట్ చేశాడట సంపత్. ఇక స్టోరీ డెవలప్ చేస్తే సినిమా చేద్దాం అని భరోసా ఇచ్చాడట. మరి 'రచ్చ' తో రామ్‌ చరణ్‌ని ఫుల్‌ మాస్‌గా చూపించిన సంపత్‌ నంది, చిరంజీవి కోసం ఎలాంటి కథ రాస్తున్నాడో చూడాలి. ఈ విషయంలో చిరంజీవి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. చూద్దాం.. చిరంజీవి కుర్ర దర్శకుల.. డైరెక్షన్ లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తారో.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: