మహేష్, బన్నీ లను తలదన్నే రేంజ్ రౌడీ ప్లాన్!!

P.Nishanth Kumar
ప్రస్తుతం మన హీరోలు సినిమా లలో మాత్రమే కాకుండా ఇతర రంగాలలో కూడా పెట్టుబడులు పెడుతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఆ విధంగా థియేటర్ బిజినెస్ లో మన టాలీవుడ్ హీరోలు ఎంటర్ అవుతూ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని స్టార్ డం ఉన్నప్పుడే డబ్బు సంపాదిస్తున్నారు. అలా టాలీవుడ్ లో స్టార్ హీరోలైన మహేష్ బాబు అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ థియేటర్ లో పెట్టుబడులు పెడుతూ భారీ గా ఆర్జించే విధంగా ముందుకు వెళ్తున్నారు.

ప్రస్తుతం ఎక్కడ చూసినా మల్టీప్లెక్స్ హవా నడుస్తుండటంతో ఎక్కువ మంది జనాలు కూడా మల్టీ ప్లెక్స్ లలో చూస్తూ ఉండడం తో మన స్టార్ హీరోలు మల్టీప్లెక్స్ థియేట ర్ లో ఇన్వెస్ట్ మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు వారిలానే విజయ్ దేవరకొండ కూడా ఏ వీ డి అనే పేరుతో థియేటర్ ను పెట్టబోతున్నాడు.  ఇది వరకే ఈ విషయం బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. వరుస సినిమాలతో పాటు వ్యాపారం పై దృష్టి సారిస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ రౌడీ పేరుతో బట్టల దుకాణం ప్రారంభించగా అది సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. 

తాజాగా మహబూబ్ నగర్ లో ఒక మల్టీప్లెక్స్ కూడా ఆవిష్కరిస్తున్నారు విజయ్. ఈ మల్టీప్లెక్స్ ఇప్పుడు ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఏషియన్ సినిమాస్ వాళ్లతో కలిసి చేస్తున్న ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం మహేష్ బాబు అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ లకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి.  దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరగగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన ఓపెనింగ్ కి అఫీషియల్ ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

AVD

సంబంధిత వార్తలు: