రామ్ చరణ్ చేసేది ఆ సినిమా సీక్వెలా..?

Anilkumar
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అక్టోబర్ 13 న విడుదల కావాల్సిన ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఇక సినిమా అనంతరం సంచలన దర్శకుడు శంకర్ తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఈ సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యింది.అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త ఇండ్రస్టీ వర్గాల్లో వినిపిస్తోంది.ఇప్పుడు తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమా గతంలో వచ్చిన ఓ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ అని తెలుస్తోంది.

దర్శకుడు శంకర్ గతంలో తెరకెక్కించిన 'ఒకే ఒక్కడు' ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్,మనీషా కొయిరాలా హీరో హీరోయిన్లు గా నటించారు.ఈ సినిమాలో అప్పటి రాజకీయ అంశాలను టార్గెట్ చేస్తూ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.దీంతో తమిళంతో పాటూ తెలుగులో కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఇదే సినిమాను హిందీలో 'నాయక్' అనే పేరుతో రీమేక్ చేసాడు దర్శకుడు శంకర్.అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు రామ్ చరణ్ తో చేయబోయే సినిమాను తెరకెక్కిస్తున్నాడట ఈ దర్శకుడు.పొలిటికల్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఈ సినిమా భారీ తారాగణంతో  ఉండనుందట.

ఇక ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.యువ సంగీత దర్శకుడు థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో చరణ్ ముందు కలెక్టర్ గా.. ఆ తర్వాత సీఎం గా కనిపిస్తాడని అంటున్నారు.మరికొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకోనున్న ఈ సినిమాని తక్కువ సమయంలో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇక నిజంగా చరణ్ చేయబోయే ఈ సినిమా గతంలో అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమాకి సీక్వెలా లేక వేరే కథతో రాబోతున్న పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమానా అనేది తెలియాలంటే మరికొన్ని రోజుల వరకు వేచి చూడాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: