కంగనా కి మళ్లీ ప్రభాస్ తోం చేయాలని ఉందట!!

P.Nishanth Kumar
బాలీవుడ్ వివాదాస్పద హీరోయిన్ కంగనా రనౌత్ తలైవి చిత్ర ప్రమోషన్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం తమిళ మాజీ సీఎం, రాజకీయ నాయకురాలు, సినీ నటి జయలలిత జీవిత ఆధారంగా తెరకెక్కగా ఈ చిత్రం యొక్క అప్డేట్లు ఎంతో ఆసక్తి నీ కలుగ చేస్తున్నాయి. సినిమా పై కూడా భారీ అంచనాలు పెంచాయి. పదహారేళ్ల వయసు నుంచి 42 ఏళ్ల మధ్య జయలలిత సినీ రాజకీయ ప్రస్థానం ఈ సినిమాలో చూపించగా ఆమె పాత్రలో నటించిన కంగనా రనౌత్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది అని చెప్పవచ్చు.

జయలలిత పాత్ర కోసం ఏకంగా 20 కిలోల బరువు పెరిగి తగ్గటం జరిగింది. ఇది ఆమెకు చాలా కష్టమైన పాత్ర అని చెప్పింది. జయలలిత మంచి భరతనాట్య కళాకారిణి. ఆమె పాత్ర కోసం భరతనాట్యం కూడా నేర్చుకున్నాను. ఈ సినిమా చేయడానికి తమిళ రాజకీయాల మీద చాలా పరిశోధనలు చేశాను అని ఆమె వెల్లడించింది. తండ్రి లేని పిల్ల జూనియర్ ఆర్టిస్టు కూతురు అని అందరూ జయలలితను తక్కువ అంచనా వేశారు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆమెను ఎగతాళి చేశారు.  చివరకు ఆమె గొప్ప నాయకురాలిగా ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. నేను కూడా బాలీవుడ్లో వివక్షకు గురయ్యాను.  అందుకే జయలలిత కథ విన్నప్పుడు నేను ఆమెకు అభిమానిగా మారాను. 

ఇక తెలుగు అభిమానులకు కూడా కంగనా రనౌత్ సుపరిచితులే. ఆమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఏక్ నిరంజన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అవకాశం వస్తే తప్పకుండా తాను మళ్లీ ప్రభాస్ తో నటించడానికి సిద్ధమే అని వెల్లడించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా సినిమా చేయడానికి వెనుకాడను అని చెప్పింది. ఎప్పుడూ ఒకే రకమైన పని చేయడం విసుగు అనిపిస్తుంది. అందుకే కథలు రాయడం దర్శకత్వం చేయడం వంటివి చేస్తున్నాను. ప్రస్తుతం ఇందిరా గాంధీ బయోపిక్ చేస్తున్నాను. చరిత్రలో వీర నారీమనుల పై సినిమాలు తీస్తాను అని చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: