అందుకే చనిపోవాలినుకుంటున్నా..అని తెలిపిన జ్యోతి..!

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నది నటి జ్యోతి. ఒకప్పుడు ఎక్కువగా హాట్ గా ఉండే గ్లామర్ రోల్స్ ను ఎక్కువగా తీసుకునేది ఈమె. కానీ ఈ మధ్యకాలంలో ఈమెకు ఆఫర్లు తగ్గిపోయాయి. అయితే ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని నిజాలను తెలిపింది నటి జ్యోతి.. ఆ విషయాలను చూద్దాం.

నటి జ్యోతి తనకు చాలా.. ఇంటిలిజెంట్ వ్యక్తులు  అంటే ఇష్టమని తెలుపుతు వచ్చింది. తనకి పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా నటించడం అంటే చాలా ఇష్టమట. తాను మెయిన్ రోల్ పాత్రలో నటించిన కొన్ని సినిమాలు కొన్ని కారణాల చేత ఆగిపోయాయని ,  అలాంటి సమయంలో నేను చాలాసార్లు చాలా డిప్రెషన్ కు  గురయ్యే దాన్ని అని తెలిపింది.
అంతేకాకుండా తనకి పిల్లలు ఉండడంచేత ఆత్మహత్య నుంచి ఎన్నోసార్లు తప్పించుకున్నాను అని తెలిపింది జ్యోతి. ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి వాటిని పోరాడాలి. అల్లరి నరేష్ నటించిన కెవ్వు కేక సినిమా షూటింగ్ కోసం మేము బ్యాంకాక్ వెళ్ళవలసి వచ్చింది. అక్కడ నేను నా  ఒంటి మీద ఒక బటర్ ఫ్లై   టాటూ వేయించుకున్నాను. దాని అర్థం ఏమిటంటే స్వేచ్ఛగా ఉండొచ్చు అని  తెలిపింది.
నేను ఎప్పుడూ ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించను .అంతే కాకుండా నా స్నేహితులు కూడా చాలా పాజిటివ్ గా ఉంటారు. కానీ ప్రస్తుతం జంబలకడిపంబ సినిమా లో ఉండే విధంగా సమాజం వుంటే బాగుంటుంది. తనని కష్టపెట్టిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు కూడా తప్పకుండా శిక్ష అనుభవిస్తారు అని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన ప్రెగ్నెంట్ ఉన్న సమయంలో తన మీద చాలామంది కామెంట్ చేసేవారట. అంతేకాకుండా అప్పుడు తను ఉంటున్న ఇంట్లో ఖాళీ చేయమని ఒత్తిడి కూడా చేశారట. దాంతో ఆమె రెండు సంవత్సరాల వయసున్న బాబుని తీసుకొని ఇంటి నుండి బయటకు వచ్చేసింది అని, ఏడుస్తూ చెప్పుకొచ్చింది జ్యోతి. ఏది ఏమైనా పాత్రను బట్టి ఆర్టిస్టులకు విలువనివ్వకుండా ఉంటేనే , ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి గౌరవం లభిస్తుంది అనేది నా మనవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: