సెలెబ్రెటీల విడాకులు.. కోట్లల్లో బరణాలు

Mamatha Reddy
చాలామంది జంటలు పెళ్లయిన తర్వాత అభిప్రాయబేధాలు వచ్చి విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ రకంగా జరగడం సెలబ్రిటీలలో ఈమధ్య ఎక్కువైపోతుంది.  ఈ విషయంపై వారు అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు పెళ్లయిన తర్వాత విడాకులు తీసుకున్నారు. వారిలో కొంతమంది భారీ నష్టపరిహారం చెల్లించి మరీ తమ భాగస్వామికి స్వస్తి పలికారు. ఆ విధంగా ఎన్నో జంటలు విడిపోయాయి. మరి ఎంత నష్టపరిహారాన్ని వారు చెల్లించుకున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సంజయ్ దత్ రియా పిళ్ళై ఇద్దరూ విభేదాల కారణంగా విడిపోగా భరణంగా ఒక సీ ఫేస్ అపార్ట్మెంట్,  ఖరీదైన కార్ భరణం గా ఇచ్చాడు సంజయ్ దత్. యశ్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా తన భార్యతో విడిపోయినప్పుడు కొన్ని కోట్ల రూపాయల మొత్తాన్ని భరణంగా ఇచ్చాడు అని వార్తలు వచ్చాయి. కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ లు విడిపోయేటప్పుడు 14 కోట్ల విలువైన బాండ్ల ను పిల్లల పేరుమీద కొనుగోలు చేశారట. వాటిపై నెలకు పది లక్షల దాకా వడ్డీ వస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ముంబైలో ఒక ఏరియాలో ఖరీదైన ఇంటిని కూడా కరిష్మా కపూర్ కి నష్టపరిహారంగా ఇచ్చారట.

సైఫ్ అలీ ఖాన్ అమృతా సింగ్ తో దాదాపు 13 ఏళ్లు కలిసి ఉంది. ఆ తర్వాత వీరు విడిపోగా భరణం గా తన ఆస్తిలో సగభాగాన్ని ఇచ్చారట సైఫ్. హృతిక్ రోషన్ తన భార్య సుజేన్ ఖాన్ తో విడాకులు తీసుకున్నదుకు గాను 380 కోట్ల రూపాయల పైకాన్ని భరణంగా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, రీనా దత్తా వ్యక్తిగత విభేదాల కారణంగా విడిపోగా కొన్ని కోట్ల రూపాయల మొత్తాన్ని అమీర్ భరణం గా ఇచ్చారట. ప్రభుదేవా రమలత్ లు విడిపోయేటప్పుడు నష్టపరిహారం లో భాగంగా పది లక్షల రూపాయలతో పాటు రెండు ఖరీదైన కార్లు 25 కోట్లు విలువ చేసే ఆస్తులను ప్రభుదేవా ఆమెకు ఇచ్చాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: