మహేష్ తో చేద్దామన్నా కాదని తరుణ్ సినిమా చేసిన దర్శకుడు!

P.Nishanth Kumar
సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా ఛాన్స్ వస్తే ఏ దర్శకుడైనా కాదంటాడా చెప్పండి.. టాలీవుడ్ నెంబర్ వన్ హీరో గా ఉన్న మహేష్ బాబు తో సినిమా చేస్తే ఏ దర్శకుడైన స్టార్ డైరెక్టర్ అయిపోయినట్లే.. ఆయనతో సినిమా చేసేందుకు దేశంలోని డైరెక్టర్ లు అందరు ఎంతగానో ఎదురుచూస్తారు. అలాంటిది మన టాలీవుడ్ లోని ఓ డైరెక్టర్ మహేష్ తో చేసే అవకాశం వస్తే దాన్ని కాదని ఆ సినిమా ను తరుణ్ తో చేశాడట.. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా..కాశీవిశ్వనాథ్. నటుడిగా మనకు సుపరిచయమైన ఈ యన రచయిత, డైరెక్టర్ కూడా..
చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేషాలు వేసి మంచి పేరు దక్కించుకున్న ఈయన కొన్ని సినిమాలకు రచన అందించి తనలోని రచయిత ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆయనలోని రచయిత ను యాక్సెప్ట్ చేసి చాలామంది ప్రేక్షకులు అయన సినిమాలను హిట్ కూడా చేయగా అయన దర్శకత్వం వహించిన నువ్వు లేక నేను చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది.. అప్పటిదాకా నటుడిగా, రచయితగా మాత్రమే ఉన్న అయన డైరెక్టర్ గా మారి తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు.. అయితే ఈ సినిమా సందర్భంగా కాశీవిశ్వనాధ్ జరిగిన ఓ సంఘటనని ఇటీవలే వెల్లడించారు.
ఈ సినిమా కి నిర్మాత గా రామానాయుడు తనయుడు సురేష్ బాబు వ్యవహరించగా ఈ చిత్రం తో మంచి లాభాలందుకున్నాడు సురేష్ బాబు. తరుణ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా కి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించగా అప్పట్లో ఈ సినిమా సెన్షేషన్ హిట్ గా నిలిచింది.. అయితే ఈ సినిమా కథ ఫైనల్ అయ్యాక హీరో గురించి ప్రస్తావన వచ్చినప్పుడు దర్శకుడు కాశీ విశ్వనాధ్ తో సురేష్ బాబు ఈ కథ కి మహేష్ బాబు అయితే సూట్ అవుతాడు.. ఆయనతో వెళదామా అన్నాడట. అప్పుడు కాశీ విశ్వనాథ్ మహేష్ గారితో అయితే చాలా టైం తీసుకుంటుంది.. తరుణ్ తో వెళదాం అన్నాడట.. అప్పటికే వరుస సినిమాల హిట్ లతో ఉన్న తరుణ్ ని ఏమికా చేశారు.. అలా మహేష్ తో చేసే అవకాశాన్ని కోల్పోయాడు కాశీ విశ్వనాధ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: