తేజ సజ్జ ఇటీవలే విడుదలైన జాంబీ రెడ్డి సినిమాతో హిట్ టాక్ తెచ్చుకున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్గా మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో తేజ మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. జాంబీ రెడ్డి విడుదలై 2 నెలలు కూడా కావట్లేదు అప్పుడే తేజ ఇష్క్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. దీనికి నాట్ ఏ లవ్ స్టోరీ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్గా నటిస్తుంది.
మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాను ఆర్.బి.చౌదరి సమర్పిస్తుండగా.. ఎన్వీ ప్రసాద్ , పారస్ జైన్,వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక కరోనా కారణంగా ‘టక్ జగదీష్’ ‘తలైవి’ వంటి సినిమాల విడుదల వాయిదా పడటంతో ఇష్క్ మూవీని ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నట్టు ఉగాది సందర్భంగా ప్రకటించారు చిత్ర దర్శక నిర్మాతలు.కానీ కరోన కేసులు పెరగడం వలన తెలంగాణలో థియేటర్స్ ని బంద్ చేశారు. అందువల్ల ఈ ఇష్క్ సినిమాని ఏప్రిల్ 23న విడుదల చేయకుండా పోస్టుపోన్ చేశారు. అయితే ప్రస్తుతం వస్తున్న టాక్ ప్రకారం ఇష్క్ సినిమాని ఓటిటి కి అమ్మేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారంట. ఇందులో నిజం ఎంతనో తెలీదు కానీ అది కూడా మంచి ఆలోచననే అని అందరూ అనుకుంటున్నారు.
ఇక ఈ సినిమా ట్రైలర్ ఈ మద్యనే విడుదల చేశారు. ట్రైలర్ను చూస్తుంటే.. థ్రిల్లర్లా అనిపిస్తోంది. ఇందులోని సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. దీనికి తోడు హీరో, హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు. మలయాళం లో గత ఏడాది వచ్చిన ఇష్క్ సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా తెలుగులో ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.