మరోసారి కొత్త సినిమాతో తన లక్ పరీక్షించుకోడానికి రాబోతున్న ఆది....

Purushottham Vinay
హీరో ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ సీనియర్ నటుడు సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. "ప్రేమ కావాలి" సినిమాతో హీరోగా తొలి సినిమాతోనే మంచి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇషా చావ్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆదికి మంచి హిట్ ని ఇచ్చింది.ఆ తరువాత బి. జయ దర్శకత్వంలో "లవ్లీ" సినిమాతో కూడా మంచి హిట్ ని అందుకున్నాడు. ఇక ఆ రెండు హిట్లతో ఆది పెద్ద స్టార్ అయిపోతాడు అనుకున్నారు అందరూ. కాని అందరూ వరుస ప్లాపులతో సతమతమవుతూ వున్నాడు.


ఇక ఈసారి ఎలా అయిన మంచి హిట్ కొట్టాలని ఎన్నో అంచనాలతో "శశి" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా పర్వాలేదు అనిపించినా కాని మినిమమ్ వసూళ్లు కూడా రాబట్టలేక అట్టర్ ప్లాప్ అయింది.ఇక ఆ సినిమా ప్లాప్ అయిందని ఏమాత్రం వెనకడుగు వెయ్యకుండా మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇక మళ్ళీ తన లక్ పరీక్షించుకోడానికి వస్తున్నాడు. మరో సినిమా చేస్తున్నాడు.భాస్కర్ బంటు పల్లి ఈ సినిమా కి కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం అందిస్తున్నారు. ఫామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా లో ఆది సరికొత్త క్యారక్టరైజేషన్ తో , సరికొత్త స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారు..


శిఖర క్రియేషన్స్ పతాకంపై టి. విజయకుమార్ రెడ్డి సమర్పిస్తుండగా గుడివాడ యుగంధర్ ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.సాకేత్ కొమండూరి సంగీతం సమకూరుస్తుండగా A. D.మార్గల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే సినిమా పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. కాగా ఈ ఉగాది పండగను పురస్కరించుకుని ఏప్రిల్ 13 న సినిమా ప్రారంభోత్సవం చేయనున్నారు.ఈ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలని ఆది కసిగా వున్నాడట.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: