కరోనా సమయంలో మహేష్కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రష్మిక..!!
రష్మిక మందన్న.. ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన `ఛలో` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రష్మిక.. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన `గీత గోవిందం` సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత దేవదాస్, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ ఇలా వరుస సినిమాలు చేస్తూ.. వరుస హిట్లు కొడుతోంది ఈ కన్నడ ముద్దుగుమ్మ. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేశ్ సరసన తనదైన ఎనర్జిటిక్ యాక్టింగ్తో అలరించింది రష్మిక. చిలిపి అమ్మాయిగా మహేష్ ప్రేమ కోసం వెంటపడే అమ్మాయిగా ఆకట్టుకొంది. ఇవన్నీ పక్కన పెడితే.. కరోనా లాక్డౌన్ కారణంగా రష్మిక కూర్గ్ లోని సుందరమైన హిల్ స్టేషన్లో తన తల్లిదండ్రులతో కలిసి ఎంతో ఆనందంగా గడుపుతోంది. అయితే ప్రస్తుతం లాక్డౌన్ తొలగించడంతో తన మిత్రులకు స్పెషల్ గిఫ్ట్లు అందజేస్తోంది. ఈ క్రమంలో తాజాగా రష్మిక మహేష్ ఇంటికి అదరిపోయే గిఫ్ట్ పంపింది.
అవకాడో ఫ్రూట్స్తో పాటు ఆవకాయను ప్యాక్ చేసి పార్సిల్ చేసింది. మహేష్ సతీమణి నమ్రత ఈ విషయాన్నిసోషల్ మీడియాలో పోస్టు పెడుతూ అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే అద్భుతమైన వాతావరణంలో... నోరూరించే గిఫ్ట్ పంపిన రష్మికకు ఆమె కృతజ్ఞతలు కూడా తెలిపింది నమ్రతా. కరోనా లాక్ డౌన్ సమయంలో మాకు అందిన మొట్టమొదటి గిఫ్ట్ ఇదే అంటూ నమ్రతా అభిమానులతో పంచుకుంది. కాగా, రష్మిక మందన్నా ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
View this post on InstagramThankyou for all the delicious goodies rashmika !! all the way from Coorg 😘😘😘#monsoonseason 💝#mangopickle 😋our first gift hamper in covid times 🤪happy monsoons !! #stayhomestaysafe A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on