మనీ: ఎల్ఐసి నుంచి అదిరిపోయే ప్లాన్..ఇలా చేస్తే ప్రతి నెల రూ.20 వేలు..!

Divya
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రకరకాల ప్లాన్స్ ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నాయి.  వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని మెరుగైన రాబడి అందించే పథకాలను ప్రవేశపెడుతూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి సరికొత్త పథకాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే పదవీ విరమణ తర్వాత మీకు ప్రతినెల 20వేల రూపాయలు లభిస్తే.. మీ వృద్ధాప్యంలో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. ఈ క్రమంలోనే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ఒక గొప్ప ప్లాన్ తో మన ముందుకు వచ్చింది అదే జీవన్ అక్షయ్ ప్లాన్..
ఎల్ఐసి ప్రవేశపెట్టిన ఈ పథకం భారత దేశంలోనే అతిపెద్ద పథకమని చెప్పవచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది.  మీరు ఎల్ఐసి పాలసీని కొనుగోలు చేయాలనుకుంటే.. ఈ పాలసీలో ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెడితే సరిపోతుంది.. ప్రతి నెల లేదా త్రైమాసికం,  అర్థ సంవత్సరం,  వార్షిక ప్రాతిపదికను కూడా పెన్షన్ పొందవచ్చు. మీకు 75 సంవత్సరాలు నిండితే ప్రతి నెల పెన్షన్ పొందవచ్చు.  ఇందుకోసం మీరు ఒకేసారి రూ.6,10,800 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.. దీనిపై ఖాతాదారుడి హామీ మొత్తం ఆరు లక్షలు .. ఈ విధంగా వార్షిక పెన్షన్ రూ.76, 650 లభిస్తుంది ఈ పెన్షన్ పెట్టుబడిదారికి జీవితాంతం అంటే మరణించే వరకు అందుబాటులో ఉండడం గమనార్హం.
ఒకవేళ మీరు ప్రతి నెల 20 వేల రూపాయలను పెన్షన్ గా తీసుకోవాలంటే ఇందులో ఒకేసారి రూ.40,72,000 పెట్టుబడి పెడితే ఈ మొత్తం మీరు పొందవచ్చు. ఇంత మొత్తం పెట్టుబడిగా పెట్టలేమనుకునేవారు.. రూ.6,10,000 పెట్టుబడిగా పెడితే ప్రతి నెల రూ.6,008 ను పెన్షన్ కింద పొందవచ్చు. ఎటు చూసినా సరే ఈ పథకం ద్వారా వృద్ధాప్యంలో మంచి లాభం లభిస్తుందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: