నవరా రైస్: ఆరోగ్యానికి చాలా మేలు?

Purushottham Vinay
నవరా రైస్ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. దీనిని ఇండియన్ వయాగ్రా రైస్ అని కూడా అంటారు. పిల్లలు కావాలి అనుకునే మగవారిలో లోపం కనుక ఉంటే  వారు ఈ రైస్ ను వారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.పక్షవాతంతో ఇబ్బంది పడుతున్నవారు ఈ బియ్యంతో చేసిన ఆహారాన్ని రోజూ తింటే కొన్ని రోజులకు పక్షవాతం తగ్గిపోతుంది.ఆయుర్వేదంలో ఈ బియ్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనితో చేసిన అన్నాన్ని బాడీ మసాజ్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు.ఈ బియ్యంతో చేసిన అన్నం మోకాళ్ళు, మోచేతి కీళ్ళ నొప్పులు, నరాల బలహీనత తగ్గడానికి తోడ్పడుతుంది.కేరళ వైద్యంలో నవరా రైస్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎముకల వ్యాధుల నివారణ కోసం ఉపయోగిస్తారు.నవారా అన్నాన్ని గుడ్డలో చుట్టి ఎముకలకు మసాజ్ చేస్తారు.నవరా బియ్యం పక్షవాతం, నరాల బలహీనత, స్థూలకాయం, ఊబకాయం సహా కొన్ని రకాల వ్యాధులను కచ్చితంగా నియంత్రిస్తుంది.


మధుమేహంతో ఇబ్బంది పడేవారు నవరా బియ్యం రోజు తినడం వలన 40 రోజులకు షుగర్ వ్యాధి కచ్చితంగా అదుపులోకి వస్తుంది.అలాగే ఈ ఎరుపు రంగు బియ్యంలో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ శరీరంలో గ్లూకోజ్ ను నియంత్రణలో ఉంచుతుంది.ఈ నవరా బియ్యం చాలా ఈజీగా జీర్ణమవుతుంది. కాబట్టి అన్ని వయసుల వారు ఈ బియ్యంతో చేసిన ఆహారపదార్ధాలను తినవచ్చు. ఆయుర్వేదం ప్రకారం రుమటాయిడ్ ఆర్థరైటిస్, డయాబెటిస్, ఒలిగోస్పెర్మియా, హేమోరాయిడ్స్, క్షయ, గర్భిణీ స్త్రీల్లో చనుబాలు పెరగడం వంటి ఎన్నో లక్షణాలు కలిగి ఉంది.ఈ బియ్యం అసలు పేరు నివార. ఏ రోగాన్ని అయినా నివారిస్తుంది. అందుకే ఈ బియ్యానికి నవరా రైస్ అనే పేరు వచ్చింది. అయితే ఈ బియ్యం ఎక్కువగా కేరళ ప్రాంతంలో పండిస్తారు.అందుకే దీనిని కేరళ బియ్యంగా కూడా పిలుస్తారు. వడ్లు నలుపు రంగులో ఉంటాయి. లోపల బియ్యం ఎరుపురంగులో ఉంటాయి. నవరా బియ్యం అనేక ఔషధ, పోషక విలువలతో ఉన్న బహుళ ప్రయోజనాలు కలిగిన బియ్యం. నవరా బియ్యాన్ని ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు. ఈ బియ్యం సువాసనతో ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: