ఫుడ్ పాయిజన్ కాకుండా ఇలా చెయ్యండి!

Purushottham Vinay
సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు వండిన ఆహార పదార్థాలను రోజంతా కూడా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసినా ఏమీ కాదనుకుంటాం. కానీ అలాంటి పదార్థాలు ఖచ్చితంగా మనకు తెలియకుండానే కలుషితమయ్యే ప్రమాదం ఉందంటోంది FSSAI.ఇక వండిన ఆహార పదార్థాలు లేదా మిగిలిపోయిన పదార్థాల్ని రెండు గంటల్లోపే ఫ్రిజ్‌లో పెట్టేయాలి. అది కూడా ఓన్లీ 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే నిల్వ చేయాలి. ఆహారం వండే పాత్రలు ఇంకా గరిటెలు శుభ్రంగా కడగకపోయినా అందులోని ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉంది.అలాగే ఆహారం వండి వార్చే క్రమంలో సరైన పరిశుభ్రతా ప్రమాణాల్ని పాటించకపోయినా ఈ సమస్య అనేది తలెత్తుతుంది.ఇంకా పచ్చి మాంసంపై ఉండే ఈకొలి అలాగే ఇతర బ్యాక్టీరియా ఫుడ్‌ పాయిజనింగ్‌కు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని ఇతర కాయగూరలు ఇంకా పండ్లతో కాకుండా విడిగా తీసుకురావాలి.ఇక రుచికి బాగానే ఉన్నా కూడా కంటికి కనిపించని బ్యాక్టీరియా వృద్ధి చెందిన ఇలాంటి కలుషితమైన ఆహారం తినడం వల్ల వాంతులు, విరేచనాలు ఇంకా డీహైడ్రేషన్‌.. వంటి సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు.


అందుకే ఫుడ్‌ పాయిజనింగ్‌ కాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా తప్పనిసరి అంటున్నారు.అలాగే ఆహారం వండే ముందు, తినే ముందు చేతులను చాలా శుభ్రంగా కడుక్కోవాలి.ఇక ప్రస్తుత పరిస్థితుల్లో బయటి ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.ఇంకా వండిన ఆహార పదార్థాలు లేదా మిగిలిపోయిన పదార్థాలపై మూతలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.అలాగే వండే ముందు, తర్వాత కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ను శుభ్రం చేయడం చాలా ముఖ్యం.ఇంకా పదార్థాల్ని పచ్చిగా తినడం కంటే ఉడికించుకొని తినడమే మంచిది. తద్వారా వాటిపై ఉండే బ్యాక్టీరియా ఈజీగా శరీరంలోకి చేరకుండా జాగ్రత్తపడచ్చు.ఇంకా మార్కెట్‌ నుంచి తీసుకొచ్చిన కూరగాయలు ఇంకా ఆకుకూరల్ని ముందుగా ఉప్పు/పసుపు వేసిన నీటిలో కడగడం చాలా ఉత్తమం. అలాగే క్యాలీఫ్లవర్‌ ఇంకా అలాగే బ్రకలీ వంటి వాటిని వండే ముందు ఉప్పు నీటిలో కాసేపు ఉడికించడం మరీ మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: