వాలెంటైన్స్ డే రోజే.. ట్రాన్స్ జెండర్లు అనుకున్నది సాధించారు?

praveen
ప్రస్తుతం పెళ్లిల సీజన్ కొనసాగుతూ ఉంది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా ప్రతిచోట కూడా కొత్త జంటలు ఇక పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. దాదాపు వచ్చే రెండు మూడు నెలల పాటు కూడా ఎక్కడ చూసినా భాజాభాజంత్రీల సవ్వళ్లే వినిపించబోతున్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఇక ఎంతో మంది యువతీ యువకులు కూడా తమ లైఫ్ పార్ట్నర్ ని వెతుక్కునే పనిలో ఉన్నారు. మరి కొంతమంది  పెళ్లికి సిద్ధమైపోయారు అని చెప్పాలి. దీంతో ఇక పెళ్లి హడావిడితో కళ్యాణ మండపాలు అన్నీ కూడా కళకళలాడిపోతున్నాయి అని చెప్పాలి.

 ఇక కొంతమంది తమ పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోయేలా వాలెంటైన్స్ డే రోజు కూడా పెళ్లి చేసుకున్నవారు ఉన్నారు. ఇక ఇటీవల కేరళలో కూడా ఇలా ప్రేమికుల రోజునే ఒక పెళ్లి జరిగింది. ఇక ఈ పెళ్లి కాస్త ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరిచింది అని చెప్పాలి. వారిద్దరూ అందరి లాంటి వారు కాదు.. విధిరాతకు వంచించబడి సభ్య సమాజంతో పోరాటం చేస్తున్నవారు. కేరళకు చెందిన ట్రాన్స్ జెండర్స్ ప్రవీణ్ నాథ్, రిషాన ఐషు ప్రేమికుల రోజునే పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో ఒక్కటయ్యారు.

 అయితే వీరికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ప్రవీణ్ 2021 కేరళ ట్రాన్స్ జెండర్ విజేత కాగా.. ఇక మల పురానికి చెందిన రిశాన మిస్ మలబార్ ట్రాన్స్ జెండర్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఇక వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి వరకు రావడానికి ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది అని చెప్పాలి. వీరిద్దరూ ట్రాన్స్ జెండర్లుగా మారుతాము అంటేనే అంగీకరించని వీరి కుటుంబ సభ్యులు.. ఇక వీరి ప్రేమను పూర్తిగా తిరస్కరించారు. ఇక వీరిద్దరూ ట్రాన్స్ జెండర్లుగా మారడానికి ముందు కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ట్రాన్స్ జెండర్ల కోసం నిర్వహించిన ఒక కార్యక్రమంలో వీరిద్దరూ కలవగా పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారి..  అతి కష్టం మీద కుటుంబ సభ్యులను ఒప్పించి చివరికి వాలెంటైన్స్ డే రోజే తమ ప్రేమకు ప్రమోషన్ ఇచ్చేసింది ఈ ట్రాన్స్ జెండర్ జంట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: