దంత సమస్యలు ఈ టిప్ తో పూర్తిగా మాయం?

Purushottham Vinay
పళ్ళ నొప్పులు ఇంకా పుచ్చిపోవడం అలాగే పచ్చగా మారడం, దంతాలు వదులుగా మారడం వంటి ఎన్నో రకాల దంత సమస్యలతో బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. దంతాల సమస్యలను తగ్గి దంతాలు ఆరోగ్యంగా ఇంకా తెల్లగా ఉండాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే అన్ని రకాల టూత్ పేస్ట్ లను ఎక్కువగా వాడుతూ ఉంటారు.రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని పేస్ట్ గా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో ఒక అర టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ ను లేదా అర టీ స్పూన్ రాళ్ల ఉప్పును వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ ఆవ నూనెను లేదా అర టీ స్పూన్ లవంగం నూనెను వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని నొప్పి ఉన్న దంతాలపై ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించాలి.


దంతాలు లూజ్ అవ్వడం, ఇంకా దంతాలు పచ్చగా మారడం వంటి సమస్యలతో బాధపడే వారు ఈ మిశ్రమాన్ని బ్రష్ తో తీసుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాల నొప్పులు, దంతాలపై ఉండే గార చాలా ఈజీగా తొలిగిపోతుంది. ఈ విధంగా వెల్లుల్లి మిశ్రమంతో పళ్ళను శుభ్రం చేసుకోవడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నశిస్తాయి. నోటి దుర్వాసన సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. ఈ టిప్ ని పాటించడం వల్ల అన్ని రకాల దంతాల సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. దంతాల సమస్యలతో బాధపడే వారు ఈ టిప్ ని క్రమం తప్పకుండా వాడడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే చక్కటి అందమైన, ఆరోగ్యవంతమైన దంతాలను మన సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: