చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు..!
2012 లో నిర్మల్లో తెలంగాణ రచయితల సంఘం 6వ మహాసభలు నిర్వహించబడ్డాయి.
జననాలు
1923లో ముదివర్తి కొండమాచార్యులు, రచయిత, పండితుడు జన్మించాడు.
1928లో రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు, రచయిత, సాహితీవేత్త. 2013 లో మరణించాడు.
1936లో హరనాథ్, తెలుగు సినిమా కథానాయకుడు జన్మించారు.1989 లో మరణించారు.
1942 లో బాడిగ రామకృష్ణ, 14 వ లోక్సభ సభ్యుడు జన్మించాడు.
1943లో మల్లావఝ్జల సదాశివ్ కవి, రచయిత, సాహితీవేత్త. 2005 లో మరణించారు.
1956 లో నందమూరి హరికృష్ణ, నటుడు, రాజకీయ నాయకుడు, నందమూరి తారక రామారావు కుమారుడు 2018 లో మరణించాడు.
1965లో సురేఖ యాదవ్, భారతీయ మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్ జన్మించారు.
1968లో జీవిత, నటి, రాజకీయ నాయకురాలు జన్మించారు.
1971లో పవన్ కళ్యాణ్, తెలుగు సినిమా కథానాయకుడు జన్మించాడు.
మరణాలు
1947: వడ్డెపల్లి వీరయ్య, ఆకుతోట మల్లయ్య, రాజ్మహ్మద్ మంత్రి కేదారి పోతుగంటి పెద్దులు, ఆయుదాలపు వీరన్న, గజ్జి పర్వతాలు, మేకల పోచయ్య బత్తుల సమ్మయ్య, గుండారపు కొంరయ్య, దాచెపెల్లి రాజయ్య,
తోనగరి పూర్ణసింగ్, జెలిగెపు మైసయ్య, గిన్నె కట్టమల్లు, అలువాల అంకూస్, కుంట ఐలయ్య, రజాకార్ల చేతుల్లో చంపబడ్డారు.
1973లో జె.ఆర్.ఆర్.టోల్కీన్, ప్రఖ్యాతుడైన ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు. 1892 జన్మించారు.
1992లో బార్బరా మెక్క్లింటక్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత 1902 జన్మించాడు.
2009లో వై.ఎస్. రాజశేఖరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకులు మరణించారు. 1949 జన్మించారు.
ప్రత్యేకతలు
ప్రపంచ కొబ్బరి దినోత్సవం.