బొప్పాయి తింటున్నారా? ఈ జాగ్రత్తలు తెలుసుకోపోతే చాలా నష్టపోతారు?

Purushottham Vinay

 బొప్పాయి పండ్లు ఎంత రుచికరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.ఎందుకంటే ఈ పండ్లలో అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మన శరీరానికి ఉపయోగపడే అనేక రకాల పోషకాలు మనకు ఈ బొప్పాయి పండ్ల ద్వారా లభిస్తాయి.పైగా వీటిల్లో విటమిన్లు సి, ఎలతోపాటు ఫోలేట్‌, మెగ్నిషియం, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి.వీటిని తినడం వల్ల గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. ఎలాంటి కంటి సమస్యలు ఉండవు. శిరోజాలు దృఢంగా ఇంకా ఒత్తుగా పెరుగుతాయి. ఎముకలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ బొప్పాయి పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. పైగా ఈ పండ్లలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి.ఇంకా అలాగే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల బొప్పాయి పండ్లను తరచూ తినడం వల్ల మనకు కచ్చితంగా చాలా మేలు జరుగుతుంది. అయితే దీన్ని తినేటప్పుడు మాత్రం కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం.చాలా మంది కూడా సిట్రస్ పండ్లు అయిన నిమ్మ, నారింజలను బొప్పాయి పండ్లతో కలిపి తింటారు. 


ఇలా తినడం వల్ల తీవ్రమైన కడుపులో మంట, గుండెల్లో మంట వంటి సమస్యలు వచ్చేందుకు కచ్చితంగా చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని అస్సలు కలిపి తినకూడదు. ఇంకా అలాగే ద్రాక్షలు, కోడిగుడ్లతోనూ ఎట్టి పరిస్థితిలో కూడా బొప్పాయి పండ్లను కలిపి తినకూడదు. అలా తింటే కచ్చితంగా తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడతారు. కాబట్టి బొప్పాయిని తినే విషయంలో కచ్చితంగా ఈ జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది.బొప్పాయి పండ్లతో కొంతమంది స్మూతీలను తయారు చేసి తాగుతారు. ఇందులో పాలను కూడా కలుపుతారు. అయితే పాలు, బొప్పాయి పండ్లను కలిపి అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇవి రెండింటినీ కలిపి తీసుకుంటే జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో అజీర్తి, గ్యాస్‌, కడుపు ఉబ్బరం ఇంకా మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి పాలను, బొప్పాయిని కలిపి తీసుకోకూడదు. ఇంకా అలాగే కొందరు బొప్పాయి పండ్లను తిన్న వెంటనే టీ తాగుతారు. ఇలా తాగినా కూడా జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. పొట్టలో అసౌకర్యం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ రెండింటినీ కూడా కలిపి తీసుకోకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: