కడుపు సమస్యలని ఈజీగా తగ్గించే టిప్స్?

Purushottham Vinay
మనలో ఒక్కరూ కూడా ఇష్టమైన వాటిని తింటూ తాగుతూ ఉంటారు. చేపలు, మాంసం, మటన్ ఇంకా జున్ను ఇలా దేనినీ మినహాయించకుండా అన్నింటినీ కూడా తెగ ఆరగిస్తుంటారు. అలాగే పోలావ్ నుంచి బిర్యానీ దాకా రకరకాల వంటకాలు అన్నీ లాగించేస్తుంటారు.అలాగే పెళ్లిళ్లు, పుట్టినరోజులు వంటి పార్టీలలో అయితే ఒక్కోసారి ఎక్కువగా తింటుంటారు. అవి తిన్న తర్వాత ఎసిడిటీ ప్రారంభమవుతుంది.ఆ ఆహారం సరిగ్గా అరగక పోవడం వల్ల ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుంది.  ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఇప్పుడు చెప్పే టిప్స్ ఖచ్చితంగా పాటించండి.ఉదయం కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. దాని ఫలితంగా మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఒకటిన్నర గ్లాసుల నీళ్లలో చెంచా సోంపు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత వడకట్టి, దానిలో కొంచెం తేనెని కలుపుకొని తాగాలి. ఇక ఈ పానీయం జీర్ణసంబంధిత సమస్యల నుంచి ఈజీగా ఉపశమనం కలిగిస్తుంది.అలాగే ఒక గ్లాసు నీటిని మరిగించి, అందులో కొన్ని పుదీనా ఆకులు ఇంకా దంచిన అల్లం ముక్క ఒకటి వేయండి. అవి బాగా మరిగించిన తర్వాత నీళ్లను ఒడగట్టి తాగాలి.



ఇది అజీర్తి సమస్యను పారదోలడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.అలాగే పొద్దున్నే చియా సీడ్ నీళ్లు తాగితే మీకు అల్పాహారం అవసరం ఉండదు. రెండు చెంచాల చియా గింజలను రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లలో మీరు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ ఇంకా 2 చెంచాల నిమ్మరసం కలుపుకోవాలి. ఇక ఈ నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఒక పెద్ద చెంచా కొత్తిమీర తురుమును తీసుకొని ఒక గ్లాసు నీళ్లలో వేసి మరిగించాలి. ఇక వడకట్టిన తర్వాత అందులో కాస్త నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఈ పానియం తాగితే శరీరం చాలా ఫిట్‌గా ఉంటుంది. ఇంకా అలాగే ఉదయాన్నే పుష్కలంగా నీళ్లు తాగడం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే నీళ్లు తాగడం అనేది శరీరాన్ని సహజంగా డిటాక్సిఫై చేయడంతోపాటు ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. ఇంకా అతిగా తినడానికి బదులుగా తక్కువ తినడానికి ప్రయత్నించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: