మతిమరుపు తగ్గి జ్ఞాపక శక్తి పెరగాలంటే..?
జటామాన్సి అనేది ఆయుర్వేద మూలికల్లో ఒకటి. ఇక ఈ మూలికలో చర్మం, జుట్టు సమస్యలను తీర్చే అద్భుతమైన గుణం ఉంది. ఇంకా అలాగే మానసిక ఆరోగ్యానికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా జ్ఞాపకశక్తిని మెరుగుపరచడమే కాకుండా మెదడు సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది.అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడేవారు జటామాన్సిని వాడితే చాలా మంచిది.ఇది జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది.దీనిలో అడాప్టర్ జెనిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి.అందువల్ల ప్రశాంతంగా ఉంచుతాయి.ఈ జటామాన్సి పొడి రూపంలో మార్కెట్లో సులభంగా దొరుకుతుంది. దీన్ని రాత్రి వేళల్లో పాలు లేదా నీటిలో కలుపుకొని తాగితే ఎంతో మంచిది. అలాగే దీన్ని టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. రెండు కప్పుల నీటిని గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి వాటిని మరిగించాలి. అవి మరుగుతున్నప్పుడు ఒక స్పూను జటామాన్సి పొడిని వేయాలి.
ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి.ఆ తర్వాత వడకట్టి వేడిగా ఉన్నప్పుడే దానిని తాగాలి. ఇది ఖచ్చితంగా మీ జ్ఞాపకశక్తిని బాగా మెరుగుపరుస్తుంది.ఈ జటామాన్సి మెదడు కణాల నిర్మాణం, మరమ్మత్తు ప్రక్రియలను చాలా అద్భుతంగా నిర్వహిస్తుంది. అలాగే కొత్త న్యూరాన్ల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇంకా దీనివల్ల టెన్షన్లు తగ్గుతాయి. దీన్ని ప్రతిరోజూ వాడితే ఖచ్చితంగా మెదడు పనితీరు మెరుగుపడుతుంది.పిల్లలు తరచూ ఈ మూలికను తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఇంకా దీనిలో న్యూరో ప్రొటెక్టివ్ ఏజెంట్లు ఉన్నాయి. ఇవి మెదడు దెబ్బతినకుండా ఇంకా జ్ఞాపకశక్తి కోల్పోకుండా కాపాడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్ను తటస్థం చేయడానికి బాగా సహాయపడతాయి. జటామాన్సిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు బాగా మెరుగుపడుతుంది. ఇంకా అలాగే వృద్ధాప్యంలో కూడా మతిమరుపు వచ్చే అవకాశం తగ్గుతుంది.