అదిరిపోయే టెక్నాలజీ.. స్మార్ట్ ఫోన్ తోనే జ్వరాన్ని గుర్తించొచ్చు?

praveen
ఇటీవల కాలం లో టెక్నాలజీ లో ఎంతలా మార్పులు వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టెక్నాలజీ లో వస్తున్న మార్పులు  మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులకు కారణమవుతున్నాయ్.  టెక్నాలజీ కారణం గా మనిషి చేసే ప్రతి పని కూడా ఎంతో సులభతరం గా మారి పోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తోనే మనిషి ప్రపంచాన్ని చుట్టేయ గలుగుతున్నాడు. అయితే ఈ టెక్నాలజీ వైద్య రంగంలో కూడా అందుబాటు లోకి వచ్చింది.


 దీంతో ఒకప్పుడు చికిత్స లేని వ్యాధులకు సైతం ఇప్పుడు అధునాతనమైన చికిత్స చేసి నయం చేయగలుగుతున్నారు వైద్యులు. అదే సమయం లో ఇక ప్రతి చిన్న సమస్యకి నేటి రోజుల్లో డాక్టర్ దగ్గరికి పరుగులు పెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే టెక్నాలజీ తో కూడిన కొన్ని పరికరాలు అందుబాటు లోకి వచ్చిన నేపథ్యం లో.. ఇక ఇంట్లోనే కూర్చుని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను సొంతంగా చికిత్స చేసుకోగలుగుతున్నారు. అయితే మొన్నటి వరకు ఇక జ్వరం తీవ్రత ఎంత ఉంది అని గుర్తించేందుకు ధర్మా మీటర్ వాడేవారు.


 కానీ ఇప్పుడు థర్మామీటర్ అవసరం లేదు. ఏకంగా స్మార్ట్ ఫోన్ తోనే జ్వరం తీవ్రతను గుర్తించేందుకు అవకాశం ఉంది. వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్ర వేత్తలు ఫీవర్ యాప్ పేరుతో కొత్త యాప్ ని రూపొందించారు. ఇక ఈ యాప్ బాడీ టెంపరేచర్ను కొలిచేందుకు మీ ఫోన్ ను థర్మామీటర్గా మార్చేస్తుంది. ఫోన్లో ఉన్న టచ్ స్క్రీన్ సెన్సార్ల సహాయం తో బాడీ టెంపరేచర్ను కొలుస్తుంది. ఇందుకోసం యాప్ ఓపెన్ చేసి కెమెరా ఆన్ చేసి ఇక కెమెరా లెన్స్ ను వ్యక్తి నుదుటిపై 90 సెకండ్ల పాటు ఉంచాలి. కాగా ప్రస్తుతం ఈ యాప్ టెస్టింగ్ దశ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: