వెల్లుల్లిని వాడేవారు ఈ విషయం గుర్తు పెట్టుకోండి?

Purushottham Vinay
వెల్లుల్లిని మనం సాధారణంగా వంటల్లో ఉపయోగిస్తున్నాం. దీన్ని రోజూ మనం ఎన్నో రుచికరమైన వంటల్లో వేస్తుంటాం. ఇవి లేకుండా వంటలు అసలు కొన్ని పూర్తి కావు. ఇవి చాలా చక్కని చక్కని వాసనను, రుచిని కలిగి ఉంటాయి.అందుకే వీటిని కాస్త దంచి కూరల్లో వేస్తుంటారు. దీంతో కూరలకు చక్కని వాసన ఇంకా రుచి వస్తాయి. ఇలా వెల్లుల్లిని కూరల్లో వేస్తే బాగా ఇష్టంగా తినేవారు చాలా మందే ఉంటారు. అయితే నిజానికి వెల్లుల్లిని పచ్చిగానే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక వెల్లుల్లిని ఖచ్చితంగా రెండు రెబ్బలు తీసుకుని దంచాలి. లేదా కత్తితో వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆ తరువాత వాటిని అలాగే కాసేపు వదిలేయాలి. ఇలా ఒక 5 నిమిషాలు అయ్యాక వాటిని తినాలి. ఇలా వెల్లుల్లిని దంచి లేదా కట్ చేశాక కాసేపు అలాగే ఉంచితే వాటిల్లో మనకు అవసరమైన చాలా సమ్మేళనాలు రిలీజ్ అవుతాయి. ఇవి మనకు చాలా మేలు చేస్తాయి. అయితే ఈ సమ్మేళనాలు ఉడకబెట్టిన లేదా వేయించిన వెల్లుల్లిలో అయితే ఉండవు.


కాబట్టి వెల్లుల్లి ద్వారా ఎక్కువ ఫలితం పొందాలనుకునే వారు వాటిని దంచి లేదా కట్ చేసి తినాల్సి ఉంటుంది.అయితే వెల్లుల్లి అనేది కాస్త ఘాటుగానే ఉంటుంది. అందుకే అందరూ దాన్ని నేరుగా తినలేరు. ఇక అలాంటి వారు వెల్లుల్లిని తేనెతో కలిపి తినవచ్చు. అందువల్ల కాస్త ఘాటు తగ్గుతుంది. ఇలా వెల్లుల్లిని ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే తినడం వల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ వెల్లుల్లి కొందరికి పడదు. పచ్చిగా తింటే పొట్టలో ఆమ్లాలు చాలా ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. దీంతో కడుపులో మంట ఇంకా గ్యాస్ వంటివి వస్తాయి. కాబట్టి ఈ సమస్యలు వచ్చిన వారు వెల్లుల్లిని తినడం ఖచ్చితంగా ఆపేయాలి. ఇంకా అలాగే వెల్లుల్లి వేడి చేసే స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి వేడి శరీరం ఉన్నవారు వేడిని తగ్గించుకునేందుకు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఇలా పలు జాగ్రత్తలను పాటిస్తూ వెల్లుల్లిని ప్రతి రోజూ తింటే వాటితో ఖచ్చితంగా చాలా లాభాలను పొందవచ్చు. దీంతో చాలా విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: