సీజనల్ టెర్రర్..జాగ్రత్తలే శ్రీరామరక్ష..!

MOHAN BABU
తెలంగాణ వ్యాప్తంగా 1206కి పైగా డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. అలాగే  510కి పైగా మలేరియా కేసులు కూడా నమోదయ్యాయి. ఇందులో  అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నమోదయ్యాయి.   డెంగ్యూ కేసుల్లో సగానికి పైగా జీహెచ్ఎంసీలోనే ఉన్నాయని చెప్పవచ్చు.  తెలంగాణను సీజనల్ విష జ్వరాలు వణికిస్తు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలుతు ఉన్నాయి. విష జ్వరాలతో ప్రభుత్వ ఆస్పత్రుల ముందు జనాల క్యూ కడుతూ ఉన్నారు. కరోనా సమయంలో  ఏ జ్వరం వచ్చిందో   అర్ధం కాక జనాలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1206కి పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలియ జేశారు.


అలాగే 510కి పైగా మలేరియా కేసులు నమోదయ్యాయి. రాష్ర్టంలో మలేరియా, డెంగ్యూ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు ఎక్కువగా  అటాక్ చేస్తున్నాయి.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిరంగా 220 మలేరియా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఆ తరువాత ములుగు జిల్లాలో 129 మలేరియా కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ కేసుల్లో సగానికి పైగా జీహెచ్ఎంసీలోనే నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 447 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికం ఇక రంగారెడ్డి జిల్లాలో 115, మేడ్చల్ జిల్లాలో 89 కేసులు నమోదయ్యాయి. అటు ఖమ్మం జిల్లాలో 128 డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దోమల లార్వా డెన్సిటీ హైదరాబాద్ లో 46 శాతం, వనపర్తిలో 46 ఉండగా ఎక్కువ ప్రాంతాల్లో 35 శాతానికి పైగా ఉన్నట్లు తెలిపారు. అన్ని జ్వరాలను ప్రజలు కోవిడ్ జ్వరాలుగా భావించి మందులు వాడొద్దన్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ సూచించింది. నగర ప్రాంతాల్లో డెంగ్యూ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నగర ప్రాంతాల్లో దోమల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్, బ్లీచింగ్, ఫాగింగ్ చర్యలు చేపడుతోంది.


నేటి నుంచి  ఆదివారం 10 గంటలకు పది నిమిషాల కార్యక్రమం చేపట్టనుంది.  జిహెచ్ఎంసీ, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పది గంటలకు 10 నిమిషాలు కార్యక్రమం నిర్వహించనున్నారు. పది వారాల పాటు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు క్లినింగ్ ప్రోగ్రాం చేపట్టాలని నగర వాసులకు పిలుపునిచ్చారు. దోమలు చేరకుండా తమ ఇళ్లతో పాటు ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: