ఆ పండుతో షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్ మాయం..

Purushottham Vinay
పైనాపిల్‌ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పొటాషియం ఇంకా సోడియం నిల్వలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఇక ఇవి ఒత్తిడి, ఆందోళన రాకుండా మనల్ని బాగా కాపాడతాయి. ఇక దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని కూడా దూరం చేస్తాయి. అలాగే పైనాపిల్‌లో 'సి' విటమిన్‌ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం ఇంకా హృదయసంబంధ వ్యాధులు అలాగే క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో బాగా పోరాడుతుంది. అంతేగాక దీనిలోని బ్రోమెలెయిన్‌ ఎంజైమ్‌ జీర్ణక్రియకు బాగా తోడ్పడుతుంది. ఇక ఇంతే కాదు చర్మ నిగారింపును పెంచే మరెన్నో ఎంజైమ్‌లు కూడా పైనాపిల్‌లో ఉన్నాయి.ఇక అలాగే పైనాపిల్ జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడంలో ఎంతగానో సహాయపడుతుంది.అలాగే పైనాపిల్ జుట్టు రాలడం తగ్గించడంలో కూడా బాగా సహాయపడుతుంది.అలాగే రక్త నాళాల్లో రక్తం అనేది గడ్డకట్ట కుండా బాగా కాపాడుతుంది.అలాగే ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు పైనాపిల్ పండు బాగా తోడ్పడుతుంది.


అలాగే పండిన పైనాపిల్ పండును తింటుంటే పళ్ళ నుండి రక్తం కారే స్కర్వే వ్యాధి కూడా రాకుండా బాగా రక్షణ కలిగిస్తుంది.అలాగే పూర్తిగా పండని పైనాపిల్ రసం తీసుకుంటే కడుపులో పురుగులు కూడా చచ్చిపోతాయి.ఇక జ్వరం, కామెర్ల వంటి సమస్యలతో అనారోగ్యంగా ఉన్న వారికి పైనాపిల్ రసం ఇవ్వడం చాలా మంచిది.అలాగే పైనాపిల్ పండును ఆహారంగా తీసుకోవడం కూడా అందరికీ తెలిసిందే. కానీ అందచందాలను ఇనుమడింపజేసే శక్తి కూడా ఇందులో ఎక్కువగా ఉంది.అలాగే పైనాపిల్ పండు రసాన్ని ముఖానికి బాగా రాసుకుని బాగా మర్థన చేస్తే ముఖ చర్మం చాలా కోమలంగా ఇంకా అందంగా మారుతుంది.ఈ పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను బాగా తొలగిస్తాయి. ఇక అంతే కాకుండా ముఖంపై నల్లటి మచ్చలను తొలగిస్తుంది.అలాగే పైనాపిల్‌లోని ఎంజైమ్స్‌ వాపులను ఇంకా నాసికా సంబంధమైన వ్యాధులను అలాగే టైఫాయిడ్‌ని తగ్గించడానికి సహాయపడుతుంది.అలాగే పచ్చి పైనాపిల్ రసాన్ని తెగిన గాయాలపైన వేస్తే రక్తస్రావం అనేది తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: