కని కరోనా: కరోనా కారణంగా కేంద్రం తీపి కబురు చెప్పింది..?

Divya

ఇప్పుడు ఎక్కడ చూసినా , విన్నా వినిపించే పేరు కరోనా..కరోనా.. గత 2 సంవత్సరాల నుంచి ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. అయితే ఇప్పుడు కరోనా కారణంగా ప్రపంచమంతా అతలాకుతలం అవుతోన్న విషయం అందరికి తెలిసిన విషయమే. మొన్నటి వరకు కరోనా ఫస్ట్ వేవ్ ప్రజలను అతలాకుతలం చేస్తే, ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చి వారి జీవితాలను మరింత అధ్వాన్నం చేసేలా వుంది. ఒకవైపు రోజురోజుకు లక్షల్లో ప్రజలు కరోనా బారినపడి మృతి చెందుతుంటే, మరొక వైపు తినడానికి ఆహారం కూడా లేక చాలా మంది సామాన్యులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.


ఇక ఫలితంగా రోజురోజుకు ప్రజల పరిస్థితి మరింత దీన స్థితికి చేరుకుంటోంది..ఇక అంతే కాకుండా సొంత రాష్ట్రాల్లో పనులు చేసుకోవడానికి కూడా లేని పరిస్థితులలో చాలామంది వలస వచ్చి, వేరే రాష్ట్రాలలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.. ఇక అలాగే రోజురోజుకు ఆర్థిక వ్యవస్థ   క్షీణిస్తోంది. రోజు వారి కొత్త కేసుల సంఖ్య ఏకంగా మూడు లక్షలకు పైగా చేరుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు తీపికబురు తీసుకొచ్చింది. అది ఏంటో ఇప్పుడు  ఒకసారి చూద్దాం.


ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్  అన్న యోజన పథకం కింద మే, జూన్ నెలలో ఉచితంగా ఆహారధాన్యాలను సమకూర్చనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఒక్కో లబ్ధిదారులకు 5 కిలోల చొప్పున ఆహారధాన్యాలను అందించనున్నట్లు వెల్లడించింది. ఈ పథకం ద్వారా ఎంతోమంది వలస వచ్చిన బాధితులకు ఎంతగానో సహాయ పడుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ పథకం ద్వారా  మొత్తం 80 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని, దీని కోసం తాము 26 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది.

ఎంతో మంది కూలి వేతనంతో జీవనం సాగిస్తున్న వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు, అంతేకాకుండా ప్రతి గ్రామాల్లోనూ ఉపాధి పథకం కింద చాలామంది పనులను చేసుకుంటున్నారు. ఇక అంతే కాకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. ఏది ఏమైనా ఇది పేదవాడికి ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: