“ఎస్సీ విద్యార్థుల”...విదేశీ విద్యకి ఉపకారవేతనాలు
"రాష్ట్ర ప్రభుత్వం 2017-18 విద్యా సంవత్సరంలో విదేశాల్లో పీజీ (మూడేళ్లు), పీహెచ్డీ (నాలుగేళ్లు) చదవాలనుకునే ఎస్సీ మొదలైన సామాజిక వర్గ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
స్కాలర్షిప్ల సంఖ్య: 100 (30 స్కాలర్షిప్లను మహిళలకు
కేటాయించారు)
సబ్జెక్టుల వారీగా ఖాళీలు: ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్-32, ప్యూర్ సెన్సైస్ అండ్
అప్లైడ్ సెన్సైస్-17, అగ్రికల్చరల్ సెన్సైస్ అండ్ మెడిసిన్-17, ఇంటర్నేషనల్ కామర్స్, అకౌంటింగ్ ఫైనాన్స్-17, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్-17.
అర్హత: పీజీ/యూజీలో 55 శాతం మార్కులు/తత్సమాన
గ్రేడ్తోపాటు విదేశాల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన వర్సిటీలు/ఇన్స్టిట్యూట్లలో
పీజీ/పీహెచ్డీలో ప్రవేశానికి అన్కండిషనల్ ఆఫర్ లెటర్ ఉన్నవారు (లేదా) అడ్మిషన్
కోసం ప్రయత్నిస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆదాయం: విద్యార్థి కుటుంబ
వార్షికాదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి.
వయసు: 2017 ఏప్రిల్ 1 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి.
ఎంపిక విధానం: (అర్హతలను బట్టి) ‘మొదట వచ్చినవారికి మొదటి ప్రాధాన్యత’ ప్రాతిపదికన ఎంపిక
చేస్తారు.
దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో పూర్తి
చేసిన దరఖాస్తులను మంత్రిత్వ శాఖ కార్యాలయానికి పంపాలి.
దరఖాస్తు చివరి తేది: 2018 మార్చి 31
పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు