“ఎస్వీయూ” దూరవిద్యా నోటిఫికేషన్

Bhavannarayana Nch

తిరుపతిలో ఉన్న శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) దూర విద్య విభాగం..డిగ్రీ..పీజీ..పీజీ డిప్లొమా.. ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్(ఓయూఎస్) కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది...రెగ్యులర్ గా చదువుకోలేని వారికి ఎస్వీయూ దూరవిద్యా విధానం ఎంతోబాగా ఉపయోగపడుతుంది.

 

అర్హతలు:  డిగ్రీ కోర్సులకు ఇంటర్; పీజీ, పీజీ డిప్లొమా కోర్సులకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఓయూఎస్‌లోని బీఏ, బీకామ్ కోర్సుల్లో చేరడానికి ఏ విద్యార్హతా లేకున్నా 18 ఏళ్లు నిండి, ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైతే చాలు. 

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్‌లో

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: ఫిబ్రవరి 28, 2018 

అపరాధ రుసుంతో దరఖాసు ఫీజు: రూ.500 అపరాధ రుసుంతో మార్చి 12 వరకు, రూ.1,000తో మార్చి 19 వరకు, రూ.2,000 అపరాధ రుసుంతో మార్చి 31 వరకు గడువు ఉంది. 

“పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు”

వెబ్‌సైట్:   www.svuniversity.edu.in  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: