24 జిల్లాల్లో ఇంటర్ పరీక్ష రద్దు... నిరాశలో విద్యార్థులు?
ఈ కారణంగా రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 12వ ఇంగ్లీష్ పేపర్ రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. స్వలాభం కోసం విద్యను మార్కెట్లో అమ్మేస్తున్నారు కొందరు... ఈ క్రమంలో ఇంటర్ సెంకడ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ను మార్కెట్లో రూ.500 కి విక్రయిస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే యాక్షన్ తీసుకున్నారు. పోలీసులు సైతం ఈ అంశం పై విచారణ చేపట్టారు. కాగా విషయం తెలుసుకున్న యూపీ బోర్డు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పేపర్ సిరీస్ 316 ఈడీ, 316 ఈఐలను రద్దు చేయాలని ఆదేశించింది. దాంతో సదరు అధికారులు జిల్లా మేజిస్ట్రేట్.. 24 జిల్లాల్లోని అన్ని కేంద్రాల్లో ఇంటర్ సెకండ్ పాలీ ఇంగ్లీష్ పరీక్షను ప్రస్తుతానికి రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పరీక్ష మళ్ళీ ఎపుడు ఉండబోతుంది అన్న వివరాలు వీలైనంత త్వరగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. పేపర్ లీక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకోవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో యూపీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ విషయంపై ఆయా జిల్లాల విద్యార్థులు పూర్తి నిరాశలో ఉన్నారు.